కేసీఆర్ దత్తత గ్రామాల్లో రేవంత్ రెడ్డి దీక్షలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీకాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటోంది. దళిత గిరిజన దండోరా సభలతో పాటు…దళిత బస్తీలను సందర్శించనుంది. సభలు నిర్వహించడంతో… కార్యకర్తల లో జోష్ వస్తుంది కానీ…అసలు జనం మనసులో ఏముందో తెలియాలంటే నేరుగా జనంలోకి వెళ్లాలని డిసైడయ్యింది. అందుకే.. ఈనెల 24, 25న జరిగే…దీక్షలకు తోడుగా… దళిత వాడల లో పర్యటించాలని నిర్ణయం తీసుకుంది. అది కూడా సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లి గ్రామం నుంచే ప్రారంభించనుంది. తన దత్తత గ్రామానికే సీఎం ఏమీ చేయలేదని, అలాంటిది రాష్ట్రానికి ఏం చేస్తారనే చర్చ పెట్టాలన్నది కాంగ్రెస్ ఆలోచన. దీక్షతో పాటు… దళిత బస్తీలో 24న రాత్రి బస చేయబోతున్నారు రేవంత్. నిద్ర చేయడం, మరుసటి రోజు దళిత వాడలోని కుటుంబాలతో నేరుగా మాట్లాడనున్నారు. ప్రభుత్వం చేపట్టిన దళిత బంధుపైనా అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. దళిత వాడలకు పార్టీ క్యాడర్ను కూడా అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది పార్టీ. కేవలం కాలనీ వాసులకు మాత్రమే ఇష్టాగోష్టి కి అనుమతి ఇవ్వాలని స్థానిక నాయకత్వానికి అదేశాలు జారీ చేసింది టీకాంగ్రెస్.
Also Read
- Tags
- cm kcr
- revanth redy
- telangana
తాజావార్తలు
-
Trump-Netanyahu: ‘‘బీబీ నీపై విసుగొచ్చింది’’.. వెలుగులోకి ట్రంప్-నెతన్యాహు సంభాషణ
-
Bathroom Tiles Cleaning Tips: రూ.10తో బాత్రూమ్ మెరుపు.. టైల్స్ శుభ్రం చేసే ఈజీ టిప్
-
Kerala High Court: ‘‘దేవుళ్ల పేరుతో ప్రమాణం చెల్లదు’’.. బీజేపీ కార్పొరేటర్లకు హైకోర్టు షాక్..
-
Sunitha : ఆ చేతులు వేయడం తప్పట్లేదు!” కాస్టింగ్ కౌచ్పై సునీత సంచలన నిజాలు
-
Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!