Revanth Reddy vs Harish Rao: కాళేశ్వరం నీటిపై అసెంబ్లీలో రచ్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy vs Harish Rao: తొమ్మిదిన్నరేళ్ల సాగునీటి శాఖ కేసీఆర్ కుటుంబం ఆధీనంలోనే ఉంది.. ప్రజల్ని మభ్యపెట్టడానికి కేసీఆర్ కుటుంబం ప్రయత్నం చేస్తోంది.. సభను హరీశ్రావు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.. కాళేశ్వరం అద్భుతం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రాజెక్టుకు ఎంత ఖర్చుచేశారు, ఎన్ని రుణాలు తీసుకున్నారన్న వివరాలు బయటకు తీస్తాం.. కార్పొరేషన్ల అప్పులకు సంతకాలు పెట్టింది ఎవరు?.. మీరొచ్చాక శివుడి తలపై ఉన్న గంగను భూమికి తెచ్చి కాళేశ్వరానికి పారించారా? అని ప్రశ్నించారు. హరీష్ అబద్ధాలు చెప్పి..ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సభను తప్పుదోవ పట్టించే వాళ్ళు ఆధారాలు లేకుండా చెప్తే.. చర్యలకు దిగండి అని తెలిపారు. ఎలాంటి చర్యలు ఉంటాయో.. శాసన సభ వ్యవహారాల మంత్రి ఆలోచన చేయాలన్నారు.
భగీరథ.. కాళేశ్వరం నీళ్లను అమ్ముకుంటాం అని చెప్పి అప్పు తెచ్చింది మీరు అంటూ మండిపడ్డారు. టీఎస్ఐఐసీ అప్పు ప్రభుత్వం కట్టలేదా ? అని ప్రశ్నించారు. శ్వేతపత్రం పేజీ నెంబర్ 21 చూసుకోవాలన్నారు. కాళేశ్వరం కోసమే 80 వేల కోట్ల రుణం తీసుకున్నారని తెలిపారు. ఇవి కాకుండా ఖర్చు ప్రభుత్వం కొన్ని నిధులు ఖర్చు పెట్టిందన్నారు. కాళేశ్వరం అద్భుతం అని హరీశ్రావు సభను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. హరీశ్రావు చెప్పేవన్నీ అబద్ధాలు అన్నారు. కాళేశ్వరంపై వచ్చే ఆదాయంతో అప్పులు చెల్లిస్తామని చూపించారని, ఇలా చెప్పే అప్పులు తీసుకువచ్చారని అన్నారు. మిషన్ భగీరథ తర్వాతనే నీళ్లు తాగామా ? 2014కు ముందు ఎవరూ నీళ్లు తాగలేదా ? అన్నారు. మిషన్ భగీరథ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తామని చూపించారని తెలిపారు. ఆదాయంతోనే అప్పులు చెల్లిస్తామని బ్యాంకులకు తప్పుడు నివేదికలు ఇచ్చారని తెలిపారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
Read also: Pawan Kalyan: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్!
హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రాజెక్టులు…ప్రగతి భవన్ పై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రగతిభన్ లో 150 గజాలు ఉన్నాయి అని…బుల్లెట్ ప్రూఫ్ గదులు ఉన్నాయి అని కాంగ్రెస్ అందన్నారు. భట్టి విక్రమార్క ప్రగతి భవన్ లో ఉంటున్నారని తెలిపారు. భట్టి విక్రమార్క చెప్పాలి…ప్రగతి భవన్ లో ఏమి ఉన్నాయో ? ఎన్ని గదులు ఉన్నాయో? అని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తున్న అన్నారు. మేము రెడీగా ఉన్నాము…ఎటువంటి విచారణకు అయిన సిద్ధమని హరీష్ రావు అన్నారు. కాగా.. ఇంతలోనే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు కి మైక్ ఇవ్వాలని వెల్ లోకి వచ్చారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
Harish Rao: శ్వేత పత్రం కక్ష సాధింపు లెక్క.. అది తప్పుల తడక
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!