కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన కేసీఆర్ నాగార్జున సాగర్ కు రాబోతున్నారు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జున సాగర్ లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నాగార్జున సాగర్ కు కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన కేసీఆర్ రాబోతున్నారని ఆయన విమర్శించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ను చూస్తే కేసీఆర్ నుంచి అనేక దుర్మార్గులు నేర్చుకోవచ్చని, చనిపోయిన కుటుంబాలకే ఏకగ్రీవంగా చేసే సంప్రదాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కి ఎన్నికలకు తేరలేపాడని అన్నారు. ఎమ్మెల్యేలు కృష్ణా రెడ్డి ,రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి లు చనిపోతే ఏకగ్రీవం కాకుండా …ఎలక్షన్ లను కలెక్షన్ లుగా మార్చి సెలక్షన్ చేయడం కేసీఆర్ నాంది పలికాడని అన్నారు.
మరీ ఇదే నాగార్జున సాగర్ లోఎందుకు నోముల భగత్ కోసం సానుభూతి ఓట్లను అడుగుతున్నారని అన్నారు. కమ్యూనిస్టు లో ఉన్నపుడు నోముల నర్సింహయ్య గారు అన్ని రంగాల కార్మికుల సమస్యలను అసెంబ్లీ లోగళం వినిపించారని, 2014 లో నాగార్జున సాగర్ లో ఎమ్మెల్యే గా నోముల నర్సింహయ్య ఓడిపోతే ఎందుకు పదవి ఇవ్వలేదు ? అని ప్రశ్నించారు. నోముల నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా గెలిచాక ఏనడైనా సీఎం వచ్చిండా అని ప్రశ్నించారు. నోముల నర్సింహయ్య బ్రతికి ఉండగా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు ? అలుగడ్డలు టమాటోలు అమ్మేవాళ్లకు మంత్రి పదవి ఇచ్చాడని అన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డికి ఉన్న అర్హతలు నోముల నర్సింహయ్య లేవా ? నోముల నర్సింహయ్య చనిపోతే …వెంటనే కుటుంబానికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు ? అని అయన ప్రశ్నించారు.
Also Read
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
- USA: అమెరికాలో భార్యను హత్య చేసిన తెలంగాణ టెక్కీ.. జీవితఖైదు పడే అవకాశం
- Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎంసీ కోటిరెడ్డి, తేరా చిన్నపరెడ్డి ఇవ్వాలా వద్దా ఆలోచించి…చివరికి నోముల భగత్ ఇచ్చారు…ఇది నోముల కుటుంబానికి అవమానం కాదా అని ఆయన అన్నారు. ఓడిపోయే టికెట్ నోముల కుటుంబానికి ఇచ్చాడని, జానారెడ్డి విజయం ఖాయం కనుకే నోముల భగత్కు టికెట్ ఇచ్చాడని అన్నారు. బలహీన వర్గాలు అంటే కేసీఆర్ కు లెక్కలేదన్న ఆయన రేపటి సిఎం కేసీఆర్ సభ కరోనా నిబంధనల ఉల్లంఘన ,ఎన్నిక ల నిబంధనలు ఉల్లంఘన తో ఉందని అన్నారు. రైతుల ఇష్టం, అనుమతి లేకుండానే పొలాల్లో సభ ఏర్పాటు చేశారు అని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం జానారెడ్డిని కలవలేదా ? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
The Tatas Web Series: టాటా సామ్రాజ్యం కథ వెబ్ సిరీస్గా.. నాలుగు తరాల చరిత్రతో ‘ది టాటాస్’
-
IMD Weather Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉత్తరాదిన కుండపోత వానలు
-
Manmadha Re-Release: శింబు కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.!
-
Iran: ఖమేనీ నివాసంపై దాడి దృశ్యాలు విడుదల.. అంత్యక్రియల వేళ ఇరాన్ సంచలన వీడియో!
-
Lenin Censor Talk : ‘లెనిన్’ సెన్సార్ టాక్.. పెద్ది లాంటి షాకింగ్ ట్విస్ట్ ఉంటుందట
ట్రెండింగ్
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!