కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన కేసీఆర్ నాగార్జున సాగర్ కు రాబోతున్నారు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జున సాగర్ లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నాగార్జున సాగర్ కు కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన కేసీఆర్ రాబోతున్నారని ఆయన విమర్శించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ను చూస్తే కేసీఆర్ నుంచి అనేక దుర్మార్గులు నేర్చుకోవచ్చని, చనిపోయిన కుటుంబాలకే ఏకగ్రీవంగా చేసే సంప్రదాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కి ఎన్నికలకు తేరలేపాడని అన్నారు. ఎమ్మెల్యేలు కృష్ణా రెడ్డి ,రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి లు చనిపోతే ఏకగ్రీవం కాకుండా …ఎలక్షన్ లను కలెక్షన్ లుగా మార్చి సెలక్షన్ చేయడం కేసీఆర్ నాంది పలికాడని అన్నారు.
మరీ ఇదే నాగార్జున సాగర్ లోఎందుకు నోముల భగత్ కోసం సానుభూతి ఓట్లను అడుగుతున్నారని అన్నారు. కమ్యూనిస్టు లో ఉన్నపుడు నోముల నర్సింహయ్య గారు అన్ని రంగాల కార్మికుల సమస్యలను అసెంబ్లీ లోగళం వినిపించారని, 2014 లో నాగార్జున సాగర్ లో ఎమ్మెల్యే గా నోముల నర్సింహయ్య ఓడిపోతే ఎందుకు పదవి ఇవ్వలేదు ? అని ప్రశ్నించారు. నోముల నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా గెలిచాక ఏనడైనా సీఎం వచ్చిండా అని ప్రశ్నించారు. నోముల నర్సింహయ్య బ్రతికి ఉండగా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు ? అలుగడ్డలు టమాటోలు అమ్మేవాళ్లకు మంత్రి పదవి ఇచ్చాడని అన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డికి ఉన్న అర్హతలు నోముల నర్సింహయ్య లేవా ? నోముల నర్సింహయ్య చనిపోతే …వెంటనే కుటుంబానికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు ? అని అయన ప్రశ్నించారు.
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎంసీ కోటిరెడ్డి, తేరా చిన్నపరెడ్డి ఇవ్వాలా వద్దా ఆలోచించి…చివరికి నోముల భగత్ ఇచ్చారు…ఇది నోముల కుటుంబానికి అవమానం కాదా అని ఆయన అన్నారు. ఓడిపోయే టికెట్ నోముల కుటుంబానికి ఇచ్చాడని, జానారెడ్డి విజయం ఖాయం కనుకే నోముల భగత్కు టికెట్ ఇచ్చాడని అన్నారు. బలహీన వర్గాలు అంటే కేసీఆర్ కు లెక్కలేదన్న ఆయన రేపటి సిఎం కేసీఆర్ సభ కరోనా నిబంధనల ఉల్లంఘన ,ఎన్నిక ల నిబంధనలు ఉల్లంఘన తో ఉందని అన్నారు. రైతుల ఇష్టం, అనుమతి లేకుండానే పొలాల్లో సభ ఏర్పాటు చేశారు అని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం జానారెడ్డిని కలవలేదా ? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Arnold Vosloo: టాలీవుడ్లో ‘ది మమ్మీ’ విలన్ రచ్చ.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’లో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ!
-
Trump: ఆ విషయంలో ఇజ్రాయెల్ కంటే సిరియానే బెటర్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
YS Jagan For Aqua Farmers: రైతుల కోసం మరో ఉద్యమానికి జగన్ సిద్ధం.. ప్రభుత్వానికి డెడ్లైన్
-
FIFA World Cup 2026: “వెంటనే యూఎస్ విడిచి వెళ్లండి”.. ఫిఫా వరల్డ్ కప్లో ఇరాన్కు ఘోర అవమానం..
-
Human Skeletons: బయటపడ్డ తలలు లేని అస్థిపంజరాలు.. ఏంటా మిస్టరీ..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?