కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన కేసీఆర్ నాగార్జున సాగర్ కు రాబోతున్నారు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జున సాగర్ లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నాగార్జున సాగర్ కు కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన కేసీఆర్ రాబోతున్నారని ఆయన విమర్శించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ను చూస్తే కేసీఆర్ నుంచి అనేక దుర్మార్గులు నేర్చుకోవచ్చని, చనిపోయిన కుటుంబాలకే ఏకగ్రీవంగా చేసే సంప్రదాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కి ఎన్నికలకు తేరలేపాడని అన్నారు. ఎమ్మెల్యేలు కృష్ణా రెడ్డి ,రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి లు చనిపోతే ఏకగ్రీవం కాకుండా …ఎలక్షన్ లను కలెక్షన్ లుగా మార్చి సెలక్షన్ చేయడం కేసీఆర్ నాంది పలికాడని అన్నారు.
మరీ ఇదే నాగార్జున సాగర్ లోఎందుకు నోముల భగత్ కోసం సానుభూతి ఓట్లను అడుగుతున్నారని అన్నారు. కమ్యూనిస్టు లో ఉన్నపుడు నోముల నర్సింహయ్య గారు అన్ని రంగాల కార్మికుల సమస్యలను అసెంబ్లీ లోగళం వినిపించారని, 2014 లో నాగార్జున సాగర్ లో ఎమ్మెల్యే గా నోముల నర్సింహయ్య ఓడిపోతే ఎందుకు పదవి ఇవ్వలేదు ? అని ప్రశ్నించారు. నోముల నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా గెలిచాక ఏనడైనా సీఎం వచ్చిండా అని ప్రశ్నించారు. నోముల నర్సింహయ్య బ్రతికి ఉండగా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు ? అలుగడ్డలు టమాటోలు అమ్మేవాళ్లకు మంత్రి పదవి ఇచ్చాడని అన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డికి ఉన్న అర్హతలు నోముల నర్సింహయ్య లేవా ? నోముల నర్సింహయ్య చనిపోతే …వెంటనే కుటుంబానికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు ? అని అయన ప్రశ్నించారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎంసీ కోటిరెడ్డి, తేరా చిన్నపరెడ్డి ఇవ్వాలా వద్దా ఆలోచించి…చివరికి నోముల భగత్ ఇచ్చారు…ఇది నోముల కుటుంబానికి అవమానం కాదా అని ఆయన అన్నారు. ఓడిపోయే టికెట్ నోముల కుటుంబానికి ఇచ్చాడని, జానారెడ్డి విజయం ఖాయం కనుకే నోముల భగత్కు టికెట్ ఇచ్చాడని అన్నారు. బలహీన వర్గాలు అంటే కేసీఆర్ కు లెక్కలేదన్న ఆయన రేపటి సిఎం కేసీఆర్ సభ కరోనా నిబంధనల ఉల్లంఘన ,ఎన్నిక ల నిబంధనలు ఉల్లంఘన తో ఉందని అన్నారు. రైతుల ఇష్టం, అనుమతి లేకుండానే పొలాల్లో సభ ఏర్పాటు చేశారు అని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం జానారెడ్డిని కలవలేదా ? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!