Revanth Reddy: ఒక్కసారి ఎమ్మెల్యే అయి.. రాజగోపాల్ రెడ్డి 22 వేల కోట్లు సంపాదించాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Sensational Allegations On Rajagopal Reddy: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డిపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని ఆ పార్టీకి రాజగోపాల్ రెడ్డి ద్రోహం చేశాడు? అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ చేసిన తప్పా..? మునుగోడులో ఎమ్మెల్యేగా గెలిపించడం తప్పా..? అని నిలదీశారు. రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ చెట్టంత మనిషిని చేసిందని, కానీ ఆయన కాంగ్రెస్ను కత్తితో పొడిచిపోయాడని మండిపడ్డారు. కాంగ్రెస్ దుష్మణ్తో రాజగోపాల్ రెడ్డి దోస్తీ చేశాడని.. కాంగ్రెస్ పార్టీని చంపనీకి ఆయన వచ్చాడని విమర్శించారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యే అయినా ఏం సంపాదించలేదని.. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే అయి రాజగోపాల్ రెడ్డి 22 వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. అమ్ముడుపోయిన సన్నాసులతో ఊరంతా పోతుందా..? అని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీపై కూడా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పట్లో బీఆర్ఎస్గా మారే అవకాశం లేదని బాంబ్ పేల్చారు. గులాబీ కూలీ పేరుతో టీఆర్ఎస్ పాల్పడిన వసూళ్లకు సంబంధించి.. తాను త్వరలోనే ఈసీకి ఫిర్యాదు చేస్తానన్నారు. అలాగే.. కేంద్ర ఇన్కమ్ టాక్స్ సంస్థకు కూడా టీఆర్ఎస్పై ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు. ఈ విషయంపై కోర్టును కూడా ఆశ్రయిస్తానన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారితే.. ఈ కేసు దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని, దీనిపై కోర్టు నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో అభివృద్ధి జరిగిందని శూన్యమన్న ఆయన.. అమ్ముడుపోయిన నేతలను ఆదరించొద్దని ప్రజల్ని కోరారు. నియోజక ఆడబిడ్డగా ఉన్న పాల్వాయి స్రవంతిని గెలిపించి.. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కోరారు. డబ్బు సంచులతో వచ్చే వారి మాటలను నమ్మి మోసపోవద్దని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Also Read
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!