Revanth Reddy: వివేక్ బీజేపీలో ఉన్నప్పుడు రాముడు.. కాంగ్రెస్ లో వస్తానే రావణాసురుడా? రేవంత్ ఫైర్
Revanth Reddy: వివేక్.. పొంగులేటి పై దాడులు దారుణమన్నారు. వివేక్ బీజేపీలో ఉన్నప్పుడు రాముడు అంతటి మంచివాడు.. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరగానే రాముడు లాంటి.. వివేక్ రావణాసురుడులాగా కనిపించాడా? అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వంద ఖాతాలు ఉన్నాయని బీజేపీ గంటలో తేల్చిందన్నారు. పొంగులేటి బంధువు అయినా పాపానికి ఆర్.సురేందర్ రెడ్డి పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారన్నారు. డబ్బులు ఉన్న వాహనంలో కూర్చోపెట్టి ఫోటోలు తీసి.. కేసు పెట్టారు పోలీసులు అని మండిపడ్డారు. సంతోష్ బంధువు.. ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్.. పీయూష్ గోయల్ ఒప్పందం ప్రకారం దాడులు జరుగుతున్నాయన్నారు. ఏకే గోయల్ ఇంట్లో వందల కోట్లు పట్టు పడ్డాయని అన్నారు. వికాస్ రాజ్ కి మేము వందల కోట్లు ఉన్నాయని ఫోన్ చేస్తే ఎత్తలేదన్నారు. కొమటిరెడ్డి.. నేను.. వంద సార్లు కాల్ చేశాం.. అయినా పట్టించుకోలేదని మండిపడ్డారు. బీజేపీకి అనుబంధ విభాగం ఈడీ.. ఐటీలు అని తెలిపారు. ప్రసంగాలకు.. జరుగుతున్న తతంగాలకు పొంతనే లేదన్నారు.
Read also: Ramakrishna: విశాఖ నుంచి పాలన కోర్టు ధిక్కరణే..!
Also Read
- Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కి, బీజేపీ సహకరించి..దాడులు చేస్తుందని ఆరోపించారు. ఏకే గోయల్ ఇంట్లో 300 కోట్లు ఉన్నాయన్నారు. ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం.. బీఆర్ఎస్ ఓట్ల కొనుగోలుకు సహకరిస్తుందన్నారు. కేసీఆర్ ని ఓడిస్తే.. రైతులకు జనవరిలో మరో ఐదు వేల అన్నారు. కేసీఆర్ ఓటుకి రూ.10 వేలు ఎంఎల్ఏ అభ్యర్థులకు పంపారని.. తక్కువ ఇస్తే అభ్యర్థులను నిలదీయండి.. డబ్బులు ఇవ్వకపోతే అంగీ లాగు గుంజుకోవాలని అన్నారు. మోడీ క్రేన్ పెట్టినా కేసీఆర్ లేవడు అని అన్నారు. అధికారంలోక్ వచ్చేది కాంగ్రెస్ అన్నారు. కౌలు రైతులకు కూడా 12 వేలు ఇస్తుంది కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ఇప్పుడు రైతు బంధు వేయడంతో.. కౌలు రైతులు, కూలీలు, రైతులు నష్టపోతారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ కె తెలివి ఉందని అనుకుంటున్నారూ అని తెలిపారు. కేసీఆర్ ఏం వేసినా తీసుకోండి.. అది మన హక్కు అన్నారు. కాంగ్రెస్ రాగానే మన ప్రభుత్వం కూడా డబ్బులు వేస్తోందని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉండి.. కేసీఆర్ పై చర్యలు తీసుకోలేదు బీజేపీ అన్నారు. మళ్ళీ గెలిస్తే చర్యలు తీసుకుంటాం అంటే ఎవరు నమ్ముతారని తెలిపారు.
Amit Shah: మత ఘర్షణల రికార్డ్ కాంగ్రెస్ దే.. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి..
తాజావార్తలు
-
Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..
-
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
-
Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
-
New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
-
Samsung Galaxy F17e 5G: సామ్ సంగ్ 5G ఫోన్ కేవలం రూ.13,774 కే.. 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!