CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
- ఐఏఎస్ బదిలీలతో సీఎం స్పష్టమైన సందేశం
- పనితీరు ఆధారంగా పోస్టింగ్స్.. రివార్డ్ vs పనిష్మెంట్
- క్షేత్రస్థాయి పనితీరుపై సీఎం అసంతృప్తి
- జనగణన ముందు వ్యూహాత్మకంగా పూర్తి చేసిన మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో శనివారం రాత్రి జరిగిన భారీ ఐఏఎస్ అధికారుల బదిలీలు అధికార యంత్రాంగంలో పెను సంచలనం సృష్టించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బదిలీల ద్వారా తన పరిపాలనా శైలిని స్పష్టం చేస్తూ, ‘క్యారెట్ అండ్ స్టిక్’ (Carrot and Stick) విధానాన్ని పక్కాగా అమలు చేశారు. అంటే.. బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలు (మంచి పోస్టింగ్స్), నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి శిక్ష (లూప్ లైన్ పోస్టింగ్స్) అనే సంకేతాన్ని పంపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అధికారులకు ఒకటే విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చారు: “ఏసీ గదులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లండి.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోండి”. అయితే, కొందరు జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలను పట్టించుకోకుండా పాత పద్ధతిలోనే సాగుతున్నారని నివేదికలు అందాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన సీఎం, ప్రభుత్వం చెప్పినట్లుగా పనితీరు మార్చుకోని అధికారులపై తన పవర్ చూపించారు.
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
జిల్లాల్లో మంచి ఫలితాలు సాధించి, సమర్థవంతంగా పనిచేస్తున్న కలెక్టర్లను గుర్తించి వారికి సచివాలయంలో కీలక శాఖల బాధ్యతలను అప్పగించారు. “పనిచేసే వారు సచివాలయంలో ఉంటే ప్రభుత్వ విధానాల అమలు వేగంగా జరుగుతుంది” అనేది సీఎం ఆలోచన. అదే సమయంలో, పదే పదే హెచ్చరించినా పనితీరు మెరుగుపరుచుకోని వారిని ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేస్తూ ‘పనిష్మెంట్’ తరహా పోస్టింగ్స్ ఇచ్చారు.
ఆదివారం నుండి దేశవ్యాప్తంగా జనగణన (Census) ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర నిబంధనల ప్రకారం జనగణన సమయంలో అధికారులను బదిలీ చేయడం వీలుపడదు. దీనిని ముందుగానే పసిగట్టిన రేవంత్ రెడ్డి, ఆ నిబంధన అమలులోకి రావడానికి కేవలం ఒక రోజు ముందే ఈ భారీ మార్పులు పూర్తి చేశారు. తద్వారా రాబోయే ఏడాది కాలం పాటు జిల్లాల్లో పక్కాగా పనిచేసే యంత్రాంగాన్ని ఆయన సిద్ధం చేసుకున్నట్లయింది.
ఈ బదిలీల ద్వారా ముఖ్యమంత్రి అధికారులందరికీ ఒక స్పష్టమైన హెచ్చరిక పంపారు. కేవలం పదవిలో ఉన్నామని కాలక్షేపం చేస్తే కుదరదని, ప్రతి అధికారి జవాబుదారీగా ఉండాలని నిరూపించారు. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను లైట్ తీసుకునే వారికి లూప్ లైన్ తప్పదని ఈ బదిలీల ద్వారా తేల్చిచెప్పారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!