Revanth Reddy: నేడు పొంగులేటి, జూపల్లితో రేవంత్ రెడ్డి కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: జులై 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర సీనియర్ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.ఈ సభకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఈ మేరకు సంబంధిత సర్కిళ్ల ద్వారా కార్యక్రమాన్ని ఖరారు చేశారు. అంతకు ముందు ఈ నెల 25న ఢిల్లీలో రాహుల్ గాంధీతో ఈ నేతలిద్దరూ సమావేశమై చర్చిస్తారని, 26న ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించనున్నారని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం జూపల్లిని కూడా కలవనున్నారు. రాహుల్ గాంధీతో సమావేశం, ఖమ్మం బహిరంగ సభపై వారితో చర్చించనున్నారు. గత మూడు నాలుగు రోజులుగా పొంగులేటి, జూపల్లితో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి, జూపల్లితో తొలుత బీజేపీ నేతలు చర్చలు జరిపారు. రాష్ట్రంలో అధికార పార్టీని బీజేపీ ఢీకొంటుందని అంచనా వేయడంతో ఈటల రాజేందర్తో పలుమార్లు చర్చలు జరిపారు.
Read also: Rashmika: ఈ సినిమాతో నార్త్ లో నేషనల్ క్రష్ సెటిల్ అయిపోవాల్సిందే
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
అయితే ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్లో చేరడమే మంచిదన్న అభిప్రాయాన్ని అనుచరులు వ్యక్తం చేయడంతో పాటు కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో పొంగులేటి, జూపల్లిలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ను ఓడించేందుకు ఈ నేతలంతా కలిసి గ్రూపుగా ఏర్పడి కొత్త రాజకీయ పార్టీ పెట్టడం లేదా కలిసి ఒకే పార్టీలో చేరడం వంటి ప్రత్యామ్నాయాలపై నెల రోజులుగా తరచూ చర్చలు జరిపారు. బీజేపీలో కూడా కాంగ్రెస్ను వీడిన నేతలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న ప్రచారంపై కూడా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ప్రచార కమిటీ చైర్మన్గా ఈటలను నియమిస్తారని వార్తలు వచ్చాయి కానీ చివరికి అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో గత మూడు నాలుగు రోజులుగా పొంగులేటి, జూపల్లి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు విస్తృతంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చివరకు బీజేపీని వీడేది లేదని ఈటల, రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం సాగుతోంది. వీరితో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు జెడ్పీ చైర్మన్లు కూడా ప్రచారంలో పాల్గొంటారు.
Somu Veerraju: దమ్ముంటే చర్చలకు రావాలంటూ.. చంద్రబాబుకు సోము వీర్రాజు సవాల్
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!