Revanth Reddy: నేడు పొంగులేటి, జూపల్లితో రేవంత్ రెడ్డి కీలక భేటీ
Revanth Reddy: జులై 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర సీనియర్ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.ఈ సభకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఈ మేరకు సంబంధిత సర్కిళ్ల ద్వారా కార్యక్రమాన్ని ఖరారు చేశారు. అంతకు ముందు ఈ నెల 25న ఢిల్లీలో రాహుల్ గాంధీతో ఈ నేతలిద్దరూ సమావేశమై చర్చిస్తారని, 26న ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించనున్నారని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం జూపల్లిని కూడా కలవనున్నారు. రాహుల్ గాంధీతో సమావేశం, ఖమ్మం బహిరంగ సభపై వారితో చర్చించనున్నారు. గత మూడు నాలుగు రోజులుగా పొంగులేటి, జూపల్లితో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి, జూపల్లితో తొలుత బీజేపీ నేతలు చర్చలు జరిపారు. రాష్ట్రంలో అధికార పార్టీని బీజేపీ ఢీకొంటుందని అంచనా వేయడంతో ఈటల రాజేందర్తో పలుమార్లు చర్చలు జరిపారు.
Read also: Rashmika: ఈ సినిమాతో నార్త్ లో నేషనల్ క్రష్ సెటిల్ అయిపోవాల్సిందే
Also Read
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
అయితే ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్లో చేరడమే మంచిదన్న అభిప్రాయాన్ని అనుచరులు వ్యక్తం చేయడంతో పాటు కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో పొంగులేటి, జూపల్లిలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ను ఓడించేందుకు ఈ నేతలంతా కలిసి గ్రూపుగా ఏర్పడి కొత్త రాజకీయ పార్టీ పెట్టడం లేదా కలిసి ఒకే పార్టీలో చేరడం వంటి ప్రత్యామ్నాయాలపై నెల రోజులుగా తరచూ చర్చలు జరిపారు. బీజేపీలో కూడా కాంగ్రెస్ను వీడిన నేతలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న ప్రచారంపై కూడా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ప్రచార కమిటీ చైర్మన్గా ఈటలను నియమిస్తారని వార్తలు వచ్చాయి కానీ చివరికి అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో గత మూడు నాలుగు రోజులుగా పొంగులేటి, జూపల్లి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు విస్తృతంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చివరకు బీజేపీని వీడేది లేదని ఈటల, రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం సాగుతోంది. వీరితో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు జెడ్పీ చైర్మన్లు కూడా ప్రచారంలో పాల్గొంటారు.
Somu Veerraju: దమ్ముంటే చర్చలకు రావాలంటూ.. చంద్రబాబుకు సోము వీర్రాజు సవాల్
తాజావార్తలు
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంటె సంగతులు అని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
-
Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
-
CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!