CM Revanth Reddy: నేడు పీఈసీ సమావేశం.. లోక్ సభ ఎన్నిక వ్యూహంపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: నేడు పీఈసీ కమిటీ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్లో జరగనుంది. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా ఏప్రిల్ 6న తుక్కుగూడలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనే సభను విజయవంతం చేసే అంశంపై కూడా సమావేశంలో చర్చిస్తారు. 6న తుక్కుగూడలో జరిగే బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్చార్జ్ దాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, పీఈసీ సభ్యులు పాల్గొంటారు.
Read also: IPL 2024 RCB vs KKR: సొంత గడ్డపై మరోసారి ఆర్సీబి గర్జిస్తుందా..?!
Also Read
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
- POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
మరోవైపు పార్లమెంటు ఎన్నికలను దృస్టిలో ఉంచుకుని ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు ఛైర్మన్ గా ప్రజల ముంగిట్లోకి జాతీయ మేనిఫెస్టో కమిటీని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. పార్టీ జాతీయ మేనిఫెస్టో ప్రజల చెంతకు చేరేలా ఏం చేయాలనే దానిపై ఈ కమిటీ 15రోజుల్లో టీపీసీకి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడ నుంచే ప్రచారానికి శంఖారావం పూరించారు. ఇక్కడి సభావేదిక నుంచే సోనియా గాంధీ 6గ్యారంటీలు ప్రకటించారు. కాగా.. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తుక్కుగూడను పార్టీ సెంటిమెంట్గా భావిస్తోంది. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న తుక్కుగూడ బహిరంగ సభను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. సభ విజయవంతానికి ఏర్పాట్లు, నిర్వహణ కమిటీలు, జనసమీకరణ తదితర అంశాలపై ఇవాళ జరిగే పీఈసీ సమావేశంలో నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.
Mukhtar Ansari : మా నాన్నకు విషమిచ్చి హత్య చేశారు.. అన్సారీని చూసి కొడుకు ఆరోపణ
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!