Revanth Reddy: ప్రాజెక్టులకు నష్టం జరిగిందని చెప్తే.. ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Fires On TRS Govt For Arresting Bhatti Vikramarka And Co: కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కని అడ్డుకోవడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీరియస్గా స్పందించారు. టీఆర్ఎస్ అవినీతి కారణంగా కాళేశ్వరంతో పాటు నిండా మునిగిన సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు పెట్టేందుకు భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారని, అసలు ఆ అవసరం ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. నిన్న (ఆగస్టు 16) కూడా ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, పొదెం వీరయ్యలను అరెస్ట్ చేసి ప్రభుత్వం పిరికిపందలా వ్యవహరించిందని విమర్శించారు. గత నెలలో వరదలు వచ్చినప్పుడే కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టులకు భారీ నష్టం జరిగిందని తాము చెప్పామని.. కానీ ప్రభుత్వం తమ మాటల్ని పట్టించుకోకుండా మూర్ఖంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
గోదావరి వరదల వల్ల జులై 14న అన్నారం (సరస్వతి), కన్నెపల్లి (లక్ష్మి) పంప్ హౌస్లు నీట మునిగాయని.. కన్నెపల్లి పంప్ హౌస్లో క్వాలిటీ లేకుండా కట్టిన ప్రొటెక్షన్ వాల్తో పాటు క్రేన్లు, లిప్పు కూలడంతో మోటార్లు తుక్కుతుక్కు అయ్యాయని రేవంత్ పేర్కొన్నారు. అన్నారం పంప్ హౌసుకు ‘డిజైన్ లోపం’ శాపంగా మారిందని.. ఫలితంగా వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఇంజనీరింగ్ నిపుణులు వెల్లడించారని రేవంత్ చెప్పారు. కానీ.. ప్రభుత్వం మాత్రం అత్యంత బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తూ, కేవలం రూ. 25 కోట్ల నష్టమే జరిగిందని అవాస్తవలు చెప్తోందన్నారు. ఆ నష్టాలను సైతం కాంట్రాక్ట్ సంస్థే భరిస్తుందని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్తో అబద్ధాలను ప్రచారం చేయించిందని ఆరోపించారు. ఇలాంటి వాస్తవాలను వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకే.. భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల బృందం ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరిందని, తమ అవినీతి బయటపడుతుందన్న భయంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పదే పదే వారిని అడ్డుకుంటోందని ఫైర్ అయ్యారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ప్రభుత్వంతో సమానంగా ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీల మీద ఉంటుందని.. అయితే ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టుల్ని సందర్శించకుండా ఆంక్షలు విధిస్తూ నిరకుశంగా వ్యవహరిస్తోందని రేవంత్ పేర్కొన్నారు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నష్టం జరగకుండా ఉంటే.. దాన్ని చూపించండానికి కేసీఆర్ ఎందుకు వణుకుతున్నారని నిలదీశారు. వాస్తవాలు బయటికి వస్తాయనే, సీఎల్పీ బృందం పర్యటనకు ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. సీఎల్పీ బృందాన్ని అరెస్ట్ చేయడాన్ని తాను ఖండిస్తున్నానని, అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని రేవంత్ డిమాండ్ చేశఆరు. అంతేకాదు.. వారి సందర్శనకు ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని, దగ్గరుండి ప్రాజెక్టుల్ని చూపించాలని కోరారు. అలా చేయకపోతే.. కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!