Site icon NTV Telugu

Revanth Reddy: గల్లీలో ఒకరు.. ఢిల్లీలో మరొకరు ధర్నా.. టీఆర్ఎస్‌, బీజేపీకి రైతులే ఉరేస్తారు..!

మరో 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి… కాంగ్రెస్‌ నేతలతో కలిసి వెళ్లి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసిన ఆయన.. సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష వైఖరిపై ఫిర్యాదు చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాజా పరిస్థితులపై గవర్నర్ కు నివేదిక ఇచ్చామన్నారు.. రైతుల గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని.. కొనుగోలు కేంద్రాలు తెరవడం ఆలస్యం వల్ల 30శాతం పంట దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు.. మిల్లర్ల దగ్గర ధాన్యం సేకరణ వివరాలు ఉన్నాయి.. వాళ్లకు బోనస్ ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. 8 లక్షల 34 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయని ఆరోపించారు రేవంత్‌ రెడ్డి.. 2,600 కోట్ల విలువైన బియ్యం కపించకపోతే సీబీఐ విచారణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read Also: RK Roja: సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయను.. కళాకారుల సమస్యలు నాకు తెలుసు

ఇక, రాజకీయ ప్రయోజనాల కోసమే గల్లీలో ఒకరు.. ఢిల్లీలో ఒకరు ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి.. ధాన్యం కొనాల్సింది పాకిస్థాన్‌ ప్రధానా? అని ప్రధాని మోడీని ప్రశ్నించిన ఆయన.. రైతుల చావుకు కారణమైన టీఆర్ఎస్‌ – బీజేపీని రైతులు ఉరేస్తారు! అని హెచ్చరించారు.. పంట వేయకుండా పడావు పెట్టిన ఎకరాకు 15వేల చొప్పున్న రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేవారు రేవంత్.. అవకతవకల పై విజిలెన్స్ విచారణ చేయాలన్న ఆయన.. వడ్లు- బియ్యం మాయం చేసినవాళ్లపై సీబీఐ విచారణ చేయలన్ఆరు.. సీఎం కేసీఆర్ అవినీతిపై వివరాలు ఉంటే ఎందుకు బీజేపీ చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.. ధాన్యం కొనుగోలు గురించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పోరాటం చేసిందని.. బీజేపీ నేతలకు సిగ్గు లేదు – లజ్జ తప్పి మాట్లాడుతున్నారూ అంటే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. మరోవైపు.. రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు… కేసీఆర్ మెడలు వంచి రైతులకు మద్దతుధర ఇప్పిస్తామని.. తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దు అని రైతులకు సూచించారు రేవంత్‌రెడ్డి.

Exit mobile version