ఆ రోజు మీటింగ్ లో కేసీఆర్ కు సహాయ సహకారాలు అందించిన ఒక్కరి పేరు కూడా ప్రస్తావించక పోవడం దుర్మార్గం అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ ను మెడలు పెట్టి బయటకు పంపించాడు…. హరీష్ రావు ను హుజూరాబాద్ లో చెట్టుకు కట్టేసాడు. హరీష్ రావును ఉరి పెడతాడేమోనని భయం భయంగా బ్రతుకుతున్నాడు.. కేజీ టు పిజి ఉచిత విద్య పై , ఉన్నత విద్యకు నిధుల కేటాయింపు పై చర్చకు సిద్ధమా, ఫీజు రి యింబర్స్ మేంట్ పై చర్చకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నవా… మీకు అధికారం లోకి వచ్చినా తర్వాత చేసిన నియామకాల కన్నా రిటైర్డ్ అయినా వారే ఎక్కువ…ఉద్యోగ ఖాళీల పై చర్చకు సిద్ధమా… ఉద్యమ కారుల పై పెట్టిన కేసులు ఉప సంహరణ పై చర్చకు సిద్ధమా… అమర వీరుల కుటుంబాలకు ఈ ప్రభుత్వం అందించిన సహాయం ఏమిటో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.
ఏడు ఏళ్లలో 7409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు… అనధికారికంగా మరో 30 వేల మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు. నువ్వు మోడీ కలిసి రైతులను మోసం చేశారు. ఢిల్లీలో మోడీ ని మెప్పించి వంద కోట్ల భూమి ని తీసుకున్నాడు. మొత్తం పార్టీ ఆఫీసు ల విలువ వేయి కోట్లు. బ్యాంకు ల్లో 420 కోట్ల డిపాజిట్ లు ఉన్నాయి… 420 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయో శ్వేత పత్రం విడుదల చేయాలి అన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ ఓ 420 అంటూ వ్యాఖ్యానించారు.