CM Revanth Reddy : ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం
- ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా.. ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
- ఈ గెలుపునకు ప్రధాన భూమిక పోషించిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు
- ఈ గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది
- నెగ్గితే ఉప్పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం కాంగ్రెస్ పార్టీకి తెలియదు. -సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నిసార్లు ఓటములు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యే ఉంటుందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలైన ఓట్లలో 51 శాతం కాంగ్రెస్కు రావడం, గత రెండేళ్ల తమ పాలనపై ప్రజల నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని అన్నారు. బీఆర్ఎస్కు 38 శాతం, బీజేపీకి 8 శాతం ఓట్లు రావడం, నగర రాజకీయ దిశను సూచిస్తోందని వ్యాఖ్యానించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే ధోరణి కొనసాగుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో పెద్దగా ఫలితాలు రాలేదని గుర్తుచేసిన సీఎం, ఇప్పుడు ప్రజలు తమ పనితీరును పరిశీలించి తీర్పు ఇచ్చారని చెప్పారు. నగరంలోని అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని, అయితే బీఆర్ఎస్ మాత్రం తప్పుడు ప్రచారానికి తెగబడుతోందని విమర్శించారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి నగరాభివృద్ధికి కలిసి పనిచేయాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు.
డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ఫోర్స్, కబ్జాల నివారణకు హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చామని తెలిపారు. ప్రజల కోసం ప్రారంభించిన ఈ చర్యలపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇటీవల ఎన్నికల్లో కిషన్ రెడ్డికి వచ్చిన ఓట్లు గతంతో పోల్చితే 25 శాతానికి పడిపోవడం “భూకంపానికి ముందు వచ్చే ప్రకంపనలా” ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తన తీరు మార్చుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సచివాలయానికి రావాలని కిషన్ రెడ్డిని ఆహ్వానించారు. కేంద్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల వివరాలు సేకరించి నివేదిక సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్కకు సూచించారు.
Bhumana Karunakar Reddy: సీబీఐ విచారణ వేసే దమ్ము ఉందా.? మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..!
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!