Revanth Reddy: ఏ డ్రగ్ టెస్ట్ కైనా రెడీ.. మీరు రెడీనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ దొరికినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరయిన చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర సంస్థలకు లేఖ రాసాను గతంలోనే అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. స్పెషల్ విచారం టీం ఏర్పాటు చెయ్యాలని. హైకోర్టు కు పోయింది నేను. డ్రగ్స్ ను అడ్డం పెట్టుకుని, సినిమా వాళ్లపై టీఆర్ఎస్ వాళ్ళు పట్టు సాధించారు. నేను మళ్ళీ కోర్టుకి వెళ్తాను. దాడి చేసిన పబ్బుకు 24 గంటల సరఫరాకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సూదిని ప్రణయ్ రెడ్డి విషయంలో మేం ఎవర్ని అయినా విడిపించమని ఆడిగామా అన్నారు రేవంత్.
అందరి నమూనాలు ఎందుకు సేకరించలేదు. నా వాళ్ళున్నా శిక్షించండి. మా వాళ్లపై అనుమానాలు ఉంటే, ఏ ఆస్పత్రి కైనా తీసుకు వచ్చి డ్రగ్ టెస్ట్ చేయిస్తా. నైతిక బాధ్యతతో ఉన్నాను. 142 మంది నమూనాలు ఎందుకు సేకరించ లేదు. మీకు కావలసిన వాళ్ళున్నారనే, అందరిని వదిలేశారు. పిల్లల్ని అడ్డు పెట్టి మా పై రాజకీయమా.. ఇది చిల్లర రాజకీయం. మా పిల్లలను తీసుకు వచ్చి టెస్ట్ చేయిస్తా..నీ కొడుకుకు టెస్ట్ చేయిస్తావా కేసీఆర్ అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ని డ్రగ్స్ హబ్ గా మార్చే ప్రయత్నం కేసీఆర్ కుటుంబం చేస్తుంది. డ్రగ్స్ పై విచారణ కోసం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయాలని రేవంత్ డిమాండ్ చేశారు.
Also Read
తెలంగాణా లో రైతులు, ఆందోళనలో ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకోవాల్సింది పోయి..బీజేపీ, టీఆర్ఎస్ లు రాజకీయం చేస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. అందుకే కళ్ళాల్లోకి కాంగ్రెస్ నిర్వహించాం. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ సప్లై చెయ్యమని ముఖ్యమంత్రి చేసిన సంతకం రైతులపట్ల మరణశాసనంలా మారింది. రైతులు పండించిన వడ్లను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. రాష్ట్రం సేకరించిన ధాన్యాన్ని, కేంద్రం కొనాలి.
https://ntvtelugu.com/pudding-and-mink-pub-case-enquiry/
తెలంగాణ లోని రైస్ మిల్లర్లతో కేసీఆర్ కుటుంబ సభ్యులు కుమ్మక్కు అయ్యారు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారు. కనీస మద్దతు ధర కంటే, తక్కువకు కొంటున్న మిల్లర్ల పై కేసులు పెట్టాలన్నారు. రేపు అన్ని జిల్లాల కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమo చేపడతామన్నారు. ఎల్లుండి సివిల్ సప్లై, విద్యుత్ సౌధలను ముట్టడిస్తాం. కేసీఆర్ కు రైతులను ఆదుకోవాలని ఉంటే, పార్లమెంట్ సమావేశాల సమయంలో ధర్నా చెయ్యాలి. మోడీకి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు. ప్రధాన మంత్రిని కలిసేందుకు ఎంపీలు, సీఎం ఎందుకు ప్రయత్నం చేయటం లేదు. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ప్రధాని మోడీని కలవాలన్నారు రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్పై 100% టారిఫ్లు? అమెరికా హౌస్లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!