Revanth Reddy: ఏ డ్రగ్ టెస్ట్ కైనా రెడీ.. మీరు రెడీనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ దొరికినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరయిన చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర సంస్థలకు లేఖ రాసాను గతంలోనే అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. స్పెషల్ విచారం టీం ఏర్పాటు చెయ్యాలని. హైకోర్టు కు పోయింది నేను. డ్రగ్స్ ను అడ్డం పెట్టుకుని, సినిమా వాళ్లపై టీఆర్ఎస్ వాళ్ళు పట్టు సాధించారు. నేను మళ్ళీ కోర్టుకి వెళ్తాను. దాడి చేసిన పబ్బుకు 24 గంటల సరఫరాకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సూదిని ప్రణయ్ రెడ్డి విషయంలో మేం ఎవర్ని అయినా విడిపించమని ఆడిగామా అన్నారు రేవంత్.
అందరి నమూనాలు ఎందుకు సేకరించలేదు. నా వాళ్ళున్నా శిక్షించండి. మా వాళ్లపై అనుమానాలు ఉంటే, ఏ ఆస్పత్రి కైనా తీసుకు వచ్చి డ్రగ్ టెస్ట్ చేయిస్తా. నైతిక బాధ్యతతో ఉన్నాను. 142 మంది నమూనాలు ఎందుకు సేకరించ లేదు. మీకు కావలసిన వాళ్ళున్నారనే, అందరిని వదిలేశారు. పిల్లల్ని అడ్డు పెట్టి మా పై రాజకీయమా.. ఇది చిల్లర రాజకీయం. మా పిల్లలను తీసుకు వచ్చి టెస్ట్ చేయిస్తా..నీ కొడుకుకు టెస్ట్ చేయిస్తావా కేసీఆర్ అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ని డ్రగ్స్ హబ్ గా మార్చే ప్రయత్నం కేసీఆర్ కుటుంబం చేస్తుంది. డ్రగ్స్ పై విచారణ కోసం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయాలని రేవంత్ డిమాండ్ చేశారు.
Also Read
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
తెలంగాణా లో రైతులు, ఆందోళనలో ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకోవాల్సింది పోయి..బీజేపీ, టీఆర్ఎస్ లు రాజకీయం చేస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. అందుకే కళ్ళాల్లోకి కాంగ్రెస్ నిర్వహించాం. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ సప్లై చెయ్యమని ముఖ్యమంత్రి చేసిన సంతకం రైతులపట్ల మరణశాసనంలా మారింది. రైతులు పండించిన వడ్లను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. రాష్ట్రం సేకరించిన ధాన్యాన్ని, కేంద్రం కొనాలి.
https://ntvtelugu.com/pudding-and-mink-pub-case-enquiry/
తెలంగాణ లోని రైస్ మిల్లర్లతో కేసీఆర్ కుటుంబ సభ్యులు కుమ్మక్కు అయ్యారు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారు. కనీస మద్దతు ధర కంటే, తక్కువకు కొంటున్న మిల్లర్ల పై కేసులు పెట్టాలన్నారు. రేపు అన్ని జిల్లాల కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమo చేపడతామన్నారు. ఎల్లుండి సివిల్ సప్లై, విద్యుత్ సౌధలను ముట్టడిస్తాం. కేసీఆర్ కు రైతులను ఆదుకోవాలని ఉంటే, పార్లమెంట్ సమావేశాల సమయంలో ధర్నా చెయ్యాలి. మోడీకి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు. ప్రధాన మంత్రిని కలిసేందుకు ఎంపీలు, సీఎం ఎందుకు ప్రయత్నం చేయటం లేదు. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ప్రధాని మోడీని కలవాలన్నారు రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!