Revanth Reddy: ఏ డ్రగ్ టెస్ట్ కైనా రెడీ.. మీరు రెడీనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ దొరికినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరయిన చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర సంస్థలకు లేఖ రాసాను గతంలోనే అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. స్పెషల్ విచారం టీం ఏర్పాటు చెయ్యాలని. హైకోర్టు కు పోయింది నేను. డ్రగ్స్ ను అడ్డం పెట్టుకుని, సినిమా వాళ్లపై టీఆర్ఎస్ వాళ్ళు పట్టు సాధించారు. నేను మళ్ళీ కోర్టుకి వెళ్తాను. దాడి చేసిన పబ్బుకు 24 గంటల సరఫరాకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సూదిని ప్రణయ్ రెడ్డి విషయంలో మేం ఎవర్ని అయినా విడిపించమని ఆడిగామా అన్నారు రేవంత్.
అందరి నమూనాలు ఎందుకు సేకరించలేదు. నా వాళ్ళున్నా శిక్షించండి. మా వాళ్లపై అనుమానాలు ఉంటే, ఏ ఆస్పత్రి కైనా తీసుకు వచ్చి డ్రగ్ టెస్ట్ చేయిస్తా. నైతిక బాధ్యతతో ఉన్నాను. 142 మంది నమూనాలు ఎందుకు సేకరించ లేదు. మీకు కావలసిన వాళ్ళున్నారనే, అందరిని వదిలేశారు. పిల్లల్ని అడ్డు పెట్టి మా పై రాజకీయమా.. ఇది చిల్లర రాజకీయం. మా పిల్లలను తీసుకు వచ్చి టెస్ట్ చేయిస్తా..నీ కొడుకుకు టెస్ట్ చేయిస్తావా కేసీఆర్ అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ని డ్రగ్స్ హబ్ గా మార్చే ప్రయత్నం కేసీఆర్ కుటుంబం చేస్తుంది. డ్రగ్స్ పై విచారణ కోసం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయాలని రేవంత్ డిమాండ్ చేశారు.
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
తెలంగాణా లో రైతులు, ఆందోళనలో ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకోవాల్సింది పోయి..బీజేపీ, టీఆర్ఎస్ లు రాజకీయం చేస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. అందుకే కళ్ళాల్లోకి కాంగ్రెస్ నిర్వహించాం. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ సప్లై చెయ్యమని ముఖ్యమంత్రి చేసిన సంతకం రైతులపట్ల మరణశాసనంలా మారింది. రైతులు పండించిన వడ్లను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. రాష్ట్రం సేకరించిన ధాన్యాన్ని, కేంద్రం కొనాలి.
https://ntvtelugu.com/pudding-and-mink-pub-case-enquiry/
తెలంగాణ లోని రైస్ మిల్లర్లతో కేసీఆర్ కుటుంబ సభ్యులు కుమ్మక్కు అయ్యారు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారు. కనీస మద్దతు ధర కంటే, తక్కువకు కొంటున్న మిల్లర్ల పై కేసులు పెట్టాలన్నారు. రేపు అన్ని జిల్లాల కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమo చేపడతామన్నారు. ఎల్లుండి సివిల్ సప్లై, విద్యుత్ సౌధలను ముట్టడిస్తాం. కేసీఆర్ కు రైతులను ఆదుకోవాలని ఉంటే, పార్లమెంట్ సమావేశాల సమయంలో ధర్నా చెయ్యాలి. మోడీకి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు. ప్రధాన మంత్రిని కలిసేందుకు ఎంపీలు, సీఎం ఎందుకు ప్రయత్నం చేయటం లేదు. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ప్రధాని మోడీని కలవాలన్నారు రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!