TS Nominations: నేడే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ నామినేషన్లు.. దద్దరిల్లనున్న కొండగల్, కరీంనగర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Nominations: కొడంగల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా రేవంత్ రెడ్డి కొడంగల్ చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు టీబీజీపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు కరీంనగర్ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి గీతాభవన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
రేవంత్ రెడ్డికి కూడా నామినేషన్ సెంటిమెంట్ ఉంది. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తాను సూచించిన గుడిలో నిత్యం పూజలు చేస్తుంటాడు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం. తెలంగాణలో ఈసారి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నందున రేవంత్ రెడ్డి ఈసెంటిమెంట్ను మరింత కఠినంగా పాటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు కొడంగల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరేగింపుగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈనెల 8న ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ప్రభుత్వ డైట్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
2007లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎనుముల రేవంత్ రెడ్డి గెలుపొందగా.. ఆ తర్వాత 2009లో కొడంగల్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరపున పోటీ చేసి 5976 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా రెండోసారి పోటీ చేసి 14614 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. భారస అభ్యర్థిగా రంగంలోకి దిగిన పట్నం నరేందర్ రెడ్డి 2010లో మళ్లీ 2015లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస తరపున పోటీ చేసి 9379 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
హుజూరాబాద్ రిజల్ట్ గజ్వేల్లోనూ పునరావృతం అవుతుందని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. 7న గజ్వేల్లో నామినేషన్ వేస్తున్నానని ప్రజలంతా తరలిరావాలని ఈటల కోరారు. ఆదివారం రాత్రి ములుగు మండలం కొక్కొండ, ఉమ్మడి కొండపాక మండలంలోని పలు గ్రామాల సర్పంచ్లు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఇక మరోవైపు సీఎం కేసీఆర్ ఈ నెల 9న నామినేషన్ వేయనున్నారు. 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా.. ఈ నెల 3వ తేదీ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.. 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు 240 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు.
Samajika Sadhikara Bus Yatra Day 9: వైసీపీ సామాజిక సాధికార యాత్ర డే 9.. ఈ రోజు ఏ నియోజకవర్గాల్లో అంటే..
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..