TS Nominations: నేడే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ నామినేషన్లు.. దద్దరిల్లనున్న కొండగల్, కరీంనగర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Nominations: కొడంగల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా రేవంత్ రెడ్డి కొడంగల్ చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు టీబీజీపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు కరీంనగర్ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి గీతాభవన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
రేవంత్ రెడ్డికి కూడా నామినేషన్ సెంటిమెంట్ ఉంది. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తాను సూచించిన గుడిలో నిత్యం పూజలు చేస్తుంటాడు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం. తెలంగాణలో ఈసారి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నందున రేవంత్ రెడ్డి ఈసెంటిమెంట్ను మరింత కఠినంగా పాటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు కొడంగల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరేగింపుగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈనెల 8న ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ప్రభుత్వ డైట్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
2007లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎనుముల రేవంత్ రెడ్డి గెలుపొందగా.. ఆ తర్వాత 2009లో కొడంగల్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరపున పోటీ చేసి 5976 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా రెండోసారి పోటీ చేసి 14614 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. భారస అభ్యర్థిగా రంగంలోకి దిగిన పట్నం నరేందర్ రెడ్డి 2010లో మళ్లీ 2015లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస తరపున పోటీ చేసి 9379 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
హుజూరాబాద్ రిజల్ట్ గజ్వేల్లోనూ పునరావృతం అవుతుందని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. 7న గజ్వేల్లో నామినేషన్ వేస్తున్నానని ప్రజలంతా తరలిరావాలని ఈటల కోరారు. ఆదివారం రాత్రి ములుగు మండలం కొక్కొండ, ఉమ్మడి కొండపాక మండలంలోని పలు గ్రామాల సర్పంచ్లు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఇక మరోవైపు సీఎం కేసీఆర్ ఈ నెల 9న నామినేషన్ వేయనున్నారు. 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా.. ఈ నెల 3వ తేదీ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.. 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు 240 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు.
Samajika Sadhikara Bus Yatra Day 9: వైసీపీ సామాజిక సాధికార యాత్ర డే 9.. ఈ రోజు ఏ నియోజకవర్గాల్లో అంటే..
తాజావార్తలు
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!