CM Revanth Reddy : ఆస్తి పంచాయితీల వల్లనే.. కేసీఆర్ కుటుంబంలో సమస్య
- కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- నేను ఎక్కడా కవితకు సపోర్ట్ చేయలేదు
- ఆస్తి పంచాయితీల వల్లనే.. కేసీఆర్ కుటుంబంలో సమస్య
- వాళ్ల పంచాయితీకి నాకు ఎలాంటి సంబంధం లేదు
- కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారు. -సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్-చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలకు సంబంధించిన పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలు ఉన్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తును కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కలిసి ఒక ఆడపిల్ల (కవిత)పై దాడి చేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది వారి కుటుంబ సమస్య అని, దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. “నేను ఎక్కడా కవితకు సపోర్ట్ చేయడం లేదు. ఇది వారి ఇంటి సమస్య. ఆస్తి తగాదాల వల్ల వారి కుటుంబ సమస్యలు బజారున పడ్డాయి. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తిరస్కరించారు. ఆ నలుగురిని తెలంగాణ ప్రజలు బహిష్కరించారు” అని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు చేయిస్తామని గతంలో కిషన్ రెడ్డి చెప్పారని, కానీ ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. “సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో దర్యాప్తు జరుపుతామని కిషన్ రెడ్డి గతంలో చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎందుకు మాట్లాడటం లేదు? కేటీఆర్ ఏం చెబితే కిషన్ రెడ్డి అది చేస్తారు. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అన్ని వివరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ కేసు నుంచి సీబీఐ మొదటి నుంచి దర్యాప్తు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయి. కాళేశ్వరం సీబీఐ విచారణ జరపకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ గాయాలు.. టీం కీలక ప్రకటన
హైదరాబాద్ మెట్రో రైలుపై మాట్లాడుతూ, ఎల్ అండ్ టి తీసుకునే నిర్ణయాలపై ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. “ఎల్ అండ్ టి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పని చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎల్ అండ్ టితో ఒప్పందం కుదుర్చుకోవాలని చెబుతోంది. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం బయటకు పోతుందని ఎక్కడ చెప్పలేదు” అని రేవంత్ రెడ్డి అన్నారు.
డ్రగ్స్ నియంత్రణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. “మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డ్రగ్స్ను కంట్రోల్ చేస్తున్నాం. మా ఈగల్ టీం గోవా వెళ్లి డ్రగ్స్తో సంబంధం ఉన్నవారిని పట్టుకుంది. హైదరాబాద్లో దొరికిన డ్రగ్స్ తయారీ కంపెనీ గత ప్రభుత్వంలోనే ఏర్పడింది. కేటీఆర్ బామ్మర్ది ఫామ్హౌస్లో డ్రగ్స్తో దొరికారు” అని ఆరోపించారు.
2014-19 మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, చట్టసభల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు.
“కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు. హరీష్ రావే మాకు 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అసెంబ్లీలో చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు” అని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. “రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ప్రస్తుతం 2 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఉంది. బీజేపీ, టీఆర్ఎస్ ఈ విషయంలో రాజకీయాలు చేస్తున్నాయి” అని విమర్శించారు.
నక్సలైట్లు లొంగిపోవడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పాలసీలు తీసుకొచ్చాయని చెప్పారు. టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పుడు, నక్సలైట్లతో చర్చలు చెప్పడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. “లోకేష్ నాకు తమ్ముడు లాంటివాడు అని కేటీఆర్ చెప్పారు. మరి తమ్ముడు లోకేష్ తండ్రిని జైల్లో పెట్టినప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు” అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
-
Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
-
Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్కు సూర్యకుమార్ యాదవ్ గుడ్బై?.. ఇదే ప్రూఫ్!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.