Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Rekha Sharma Visits Ts Womens Commission Office

Sunitha Laxma Reddy: తెలంగాణ మహిళా కమిషన్ ఆఫీసుకి రేఖా శర్మ

Published Date :July 18, 2022 , 7:26 pm
By NTV WebDesk
Sunitha Laxma Reddy: తెలంగాణ మహిళా కమిషన్ ఆఫీసుకి రేఖా శర్మ
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై మహిళా కమిషన్ దృష్టిపెడుతోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి జాతీయ ఛైర్ పర్సన్ రేఖా శర్మ విచ్చేశారు. మహిళల న్యాయపరమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి లీగల్ సెల్‌, అందుబాటులో వాట్సాప్ నెంబర్ వుందన్నారు. మహిళలకు చట్టబద్ధమైన సహాయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో మహిళల న్యాయపరమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి లీగల్ సెల్‌ ను జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు.

రాష్ట్రంలో మహిళలకు ఉచిత న్యాయ సలహాలు, సేవలు అందించడమే న్యాయ సహాయ కేంద్రం లక్ష్యమని జాతీయ చైర్మన్ రేఖా శర్మ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కమిషన్ కార్యక్రమాలను, సేవలను అడిగి తెలుసుకున్నారు. లీగల్ సెల్ మహిళల హక్కులను పరిరక్షించడంపై దృష్టి సారించడం, వారికి చట్టపరమైన సలహాలు, సహాయం కోసం వన్-స్టాప్ సెంటర్‌గా పనిచేస్తుందని మహిళలు ఎక్కడికీ వెళ్లకుండా న్యాయ సహాయం పొందగలుగుతారని చైర్‌పర్సన్ తెలిపారు.

Presidential Election 2022: ముగిసిన పోలింగ్.. 99.18% ఓటింగ్ నమోదు

వాక్-ఇన్ ఫిర్యాదుదారులకు కౌన్సెలింగ్ అందించడంతో పాటు ఆపదలో ఉన్న మహిళలకు న్యాయ సహాయం, సలహాలు మరియు వివిధ పథకాలపై సమాచారం అందిస్తుందని జాతీయ చైర్ పర్సన్ రేఖా శర్మ అన్నారు. చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి తెలంగాణ కమిషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. మహిళా సాధికారత, మహిళల రక్షణ, మహిళా అభ్యున్నతికి మరియు రాష్ట్ర మహిళా కమిషన్, చట్టాలపై మహిళా చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు, మానవ అక్రమ రవాణపై చేస్తున్న కార్యక్రమాల గురించి జాతీయ మహిళ కమిషన్ చైర్ పర్సన్ కు వివరించారు.

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళలకు చెరువుగా ఉండేందుకు ప్రారంభించిన వాట్సాప్ హెల్ప్ లైన్ 9490555533, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌ స్టాగ్రామ్ @SCWTelangana ద్వారా మహిళా కమిషన్ కి వస్తున్న ఫిర్యాదులు గురించి తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ రవాణాకు గురవుతున్న వారిని గుర్తించి రక్షించడంతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తూ ఇతర సౌకర్యాలు కల్పిస్తోందని చైర్ పర్సన్ తెలియజేశారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ జిల్లాల్లో ఏ.హచ్. టి.యు లు ఏర్పాటు చేసిందని అలాగే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

పిల్లలు, మహిళలపై సైబర్ నేరాలు, ఆన్ లైన్ ట్రాఫికింగ్ అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంటీ హ్యూమన్ ట్రాఫకింగ్ యూనిట్స్, షీ సైబర్ సెల్ ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాగే ఒడిషా నుంచి వలస వచ్చిన కూలీల పిల్లల కోసం మరియు ట్రాఫికింగ్ లో గుర్తించిన వారికోసం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో పోలీస్ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ కలిసి ఒరియా పాఠశాలను ఏర్పాటు చేశారని తెలిపారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల మూడో శనివారం నాడు రాష్ట్రంలో అన్ని ఐసీడీస్ ప్రాజెక్టులలో స్వరక్ష డే నిర్వహించడం జరుగుతుందని చైర్ పర్సన్ తెలిపారు. మానవ అక్రమ రవాణాను అరిక్టేందుకు అంతర్ రాష్ట్రాల సహకారం ఎంతో ముఖ్యమని చైర్ పర్సన్ జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మకు తెలియజేశారు.

Cobra: ఆకట్టుకున్న ‘అధీర..’ సాంగ్ లిరికల్ వీడియో!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Facebook
  • national womens commission
  • Rekha Sharma
  • SCWTelangana
  • sunitha laxmareddy

తాజావార్తలు

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions