Bhatti Vikramarka: ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.. మాకు కొంత అయిష్టంగానే ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కానీ ఆ బడ్జెట్ ను ఓట్ ఆన్ అకౌంట్ గా ప్రవేశపెట్టారు. దీంతో పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గా ప్రవేశపెట్టడంపై చర్చ జరగనుంది. దీనికి భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ను ఓట్ ఆన్ అకౌంట్గా పెట్టేందుకు కొంత అయిష్టంగానే ఉందని అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2024న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిందని.. నిధులు ఎలా ఇవ్వాలనే విషయంలో మొదటి నుంచి మా ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వీలైనంత ఎక్కువగా వినియోగించాలని, ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు కేటాయింపులు చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Read also: Telangana Budget: త్వరలోనే రూ. 500లకే గ్యాస్ సిలిండర్.. 200 వరకు ఉచిత విద్యుత్..
Also Read
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్య స్థాపనే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశపెడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే ఈ బడ్జెట్ లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా 6 హామీలను పకడ్బందీగా అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి కల్పనలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర అభివృద్ధిని సాధిస్తామన్నారు. గత పాలకులు ప్రభుత్వ ఖజానాను దివాళా తీయించారన్నారు. ప్రణాళిక లేకుండా, హేతుబద్ధీకరణ లేకుండా చేసిన అప్పులు ఇప్పుడు పెద్ద సవాలుగా మారాయన్నారు. అయితే ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు, సహేతుకమైన కార్యకలాపాలతో ఈ సవాళ్లను అధిగమిస్తామన్నారు. దుబారాను తమ ప్రభుత్వం అరికడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి పనికిరాని ఆస్తులను పెంచి తెలంగాణ ప్రజలపై భారం మోపడం తమ విధానం కాదన్నారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెంది సంతోషించడమే తమ ఏకైక లక్ష్యమని తెలిపారు. ఇందుకు అనుగుణంగానే తమ ప్రభుత్వ విధానాలు ఉంటాయని ఈ బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా మరోసారి స్పష్టం చేస్తున్నట్టు భట్టి తెలిపారు.
Telangana Budget 2024: త్వరలో మెగా డీఎస్సీ.. 15000 మంది కానిస్టేబుళ్లకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు
తాజావార్తలు
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!