తెలంగాణలో రేపటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు బుధవారం నుంచి బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ తెలిపింది. పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సాఫ్ట్వేర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముందు శనివారానికి బదులుగా మంగళవారం నుంచి పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో బుధవారం నుంచి పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రతి నెల 1వ తేదీ లేదా 2వ తేదీ నుంచి రేషన్ బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
Read Also: మరిన్ని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలి : సీఎం కేసీఆర్
Also Read
ప్రతి కార్డుపై 10 కిలోల రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు. గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో 6,10,866 ఆహార భద్రత కార్డులు, రంగారెడ్డి 6, 55, 957 కార్డులు, మేడ్చల్ జిల్లాలో 5,24, 594 కార్డులు ఉన్నాయి. కాగా రేషన్ డీలర్లలో కొందరు కరోనా బారిన పడటంతో వారి స్థానంలో కొత్తగా ఎవరిని నియమించలేదని.. ఉన్న సిబ్బందే అదనంగా విధులు నిర్వహించాల్సి వస్తోందని కొందరు రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!