Minister Seethakka: ముఖ్యమంత్రి మహిళల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నారు..
- షాద్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
- రూ.35 కోట్లతో పలు రోడ్లు, కమ్యూనిటీ హల్స్కు శంకుస్థాపన
- మహిళ సాధికారిత కోసం రూ. 80 కోట్ల నిధులు మంజూరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ. 35 కోట్లతో పలు రోడ్లు, కమ్యూనిటీ హల్స్ శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. మహిళ సాధికరితకు రూ. 80 కోట్ల నిధులు మంజూరు చేశారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయాలని నిశ్చయించుకున్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత మహిళల అభ్యున్నతికి ఆలోచిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని అన్నారు. మహిళా సంఘాలకు 19 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Read Also: K.A. Paul: కేటీఆర్పై కేసు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
- Chevella Bus Tragedy: బస్సు ప్రమాదంలో తల్లితో పాటు 3 నెలల చిన్నారి మృతి.. గుండెల్ని పిండేస్తున్న ఫోటో
మహిళలు ఎదుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. ఒక్క చీర ఇచ్చి వందల సార్లు చెప్పుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులది అని ఆరోపించారు. రైతులకు 21 వేల కోట్లు రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో గుట్టలకు, రోడ్లకు రైతు బంధు ఇచ్చారు.. బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్ల ప్రభుత్వం పై 24 వేల కోట్లు భారం పడిందని అన్నారు. మరోవైపు.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలపై బురద జల్లుతున్నరన్నారు. మహిళలు తలుచుకుంటే ఇంటినే కాదు, సమాజాన్ని, దేశాన్ని సైతం ఏలగలరని మంత్రి సీతక్క తెలిపారు.
Read Also: Journalist Murder: అవినీతిని వెలికి తీసిన జర్నలిస్ట్ హత్య.. ముగ్గురి అరెస్ట్..
తాజావార్తలు
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?