Minister Seethakka: ముఖ్యమంత్రి మహిళల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నారు..
- షాద్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
- రూ.35 కోట్లతో పలు రోడ్లు, కమ్యూనిటీ హల్స్కు శంకుస్థాపన
- మహిళ సాధికారిత కోసం రూ. 80 కోట్ల నిధులు మంజూరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ. 35 కోట్లతో పలు రోడ్లు, కమ్యూనిటీ హల్స్ శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. మహిళ సాధికరితకు రూ. 80 కోట్ల నిధులు మంజూరు చేశారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయాలని నిశ్చయించుకున్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత మహిళల అభ్యున్నతికి ఆలోచిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని అన్నారు. మహిళా సంఘాలకు 19 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Read Also: K.A. Paul: కేటీఆర్పై కేసు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
మహిళలు ఎదుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. ఒక్క చీర ఇచ్చి వందల సార్లు చెప్పుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులది అని ఆరోపించారు. రైతులకు 21 వేల కోట్లు రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో గుట్టలకు, రోడ్లకు రైతు బంధు ఇచ్చారు.. బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్ల ప్రభుత్వం పై 24 వేల కోట్లు భారం పడిందని అన్నారు. మరోవైపు.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలపై బురద జల్లుతున్నరన్నారు. మహిళలు తలుచుకుంటే ఇంటినే కాదు, సమాజాన్ని, దేశాన్ని సైతం ఏలగలరని మంత్రి సీతక్క తెలిపారు.
Read Also: Journalist Murder: అవినీతిని వెలికి తీసిన జర్నలిస్ట్ హత్య.. ముగ్గురి అరెస్ట్..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?