Ramchander Rao: టైమ్ కూడా ఇవ్వం, జైలుకు పంపిస్తాం.. బీజేపీ కార్యకర్తలకు అధ్యక్షుడు వార్నింగ్!
- బీజేపీ సోషల్ మీడియా, లీగల్ సెల్ సమావేశం
- పార్టీ కార్యకర్తలకు అధ్యక్షుడు రామచందర్ రావు వార్నింగ్
- టైమ్ కూడా ఇవ్వం, జైలుకు పంపిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ కార్యకర్తలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తాం అని హెచ్చరించారు. టైమ్ కూడా ఇవ్వం అని, అవసరం అయితే జైలుకు పంపిస్తాం అని కార్యకర్తలతో అన్నారు. కొందరు తాము బీజేపీ అంటూనే.. బీజేపీ నేతల మీదనే పోస్టింగ్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వంను అస్సలు చంపుకోవద్దని సోషల్ మీడియా, యూట్యూబ్ వారికి రామచందర్ రావు విజ్ఞప్తి చేశారు. బీజేపీ సోషల్ మీడియా, లీగల్ సెల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు.
‘పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తాం, టైమ్ కూడా ఇవ్వం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఫేక్ అకౌంట్స్ ద్వారా బీజేపీపై పోస్టులు పెడుతున్నాయి. పార్టీ నేతలు ఒక మంత్రి దగ్గరకు వెళితే.. పిర్యాదు చేసేందుకు వెళ్లారని రాశారు. ఆ పేపర్ మీద రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేశాం. మేము బీజేపీ అంటూనే.. బీజేపీ నేతల మీదనే పోస్టింగ్లు పెడుతున్నారు. కేసులు పెట్టీ జైలుకు పంపిస్తాం. ఇప్పటికే కేసులు పెట్టాం. పార్టీ మీద ఎవరు పోస్టులు చేసినా కౌంటర్ ఇవ్వండి. బీజేపీ చిల్లర రాజకీయాలకు భయపడదు. దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడండి’ అని రామచందర్ రావు అన్నారు.
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
Also Read: Ibomma Ravi: ఐబొమ్మ రవికి 5 రోజుల పోలీస్ కస్టడీ.. ఇక డబిడదిబిడే!
‘డబ్బులిస్తే ఏది పడితే అది రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎవరిని ఉపేక్షించేది లేదు. యూట్యూబ్లో మాట్లాడుతున్నారు. ఒకరు దుబాయ్, మరొకరు అమెరికాలో ఉండి తిడుతున్నారు. మీరు ఇండియాకు రండి మీ సంగతి చెబుతాం. పార్టీ కార్యకర్తలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నేతలు ఎవరిని ప్రోత్సహించినా, వాటిని ఫార్వర్డ్ చేసినా సిరియస్ యాక్షన్ ఉంటుంది. నా మీద కూడా ఫేక్ వార్తలు వస్తాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇస్తున్నా, మా మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకండి. సోషల్ మీడియా, యూట్యూబ్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.. మీ వ్యక్తిత్వంను చంపుకోవద్దు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కోరారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!