Ramchander Rao : 46 సార్లు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దక్కలేదు
- మతపరమైన రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తున్నాం
- తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడం కేంద్రం బాధ్యత అని అని అంటున్నారు
- లీగల్ ఒపీనియన్ లేకుండా ఆర్డినెన్స్ తీసుకువచ్చారు
- తొమ్మిదో షెడ్యూల్లో పెట్టే ప్రక్రియ ముఖ్యమంత్రి కి తెలుసా :బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramchander Rao : పార్టీని ఎలా నడిపించాలనే విషయంపై పెద్దల మార్గదర్శనం తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చానని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 46 సార్లు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దక్కలేదన్నారు. కానీ ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులందరూ ఎప్పుడు అడిగితే అప్పుడు రేవంత్ రెడ్డికి సమయం ఇచ్చారని, మీ పార్టీ ముఖ్యమంత్రి కి మీరే ఎందుకు సమయం ఇవ్వడం లేదు చెప్పాలన్నారు రామచందర్ రావు. మతపరమైన రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడం కేంద్రం బాధ్యత అని అని అంటున్నారని, లీగల్ ఒపీనియన్ లేకుండా ఆర్డినెన్స్ తీసుకువచ్చారన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్. తొమ్మిదో షెడ్యూల్లో పెట్టే ప్రక్రియ ముఖ్యమంత్రి కి తెలుసా ? అని ఆయన ప్రశ్నించారు.
తొమ్మిదో షెడ్యూల్లో పెట్టే అంశాలు కూడా న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, 2006లో అయ్యర్ కోహ్లీ కేసులో .. సుప్రీంకోర్టు మరోసారి కేశవనంద భారతి కేసు తీర్పు ను దగ్గర మరోసారి పునరుద్ఘాటించిందన్నారు. తెలంగాణ బీసీలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి ఆర్డినెన్స్ తెచ్చారని, న్యాయపరమైన చిక్కులు తెలిసి …బీసీలను మోసం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలన్నారు. బీసీ బిల్లుకు, ఆర్డినెన్స్ కు మద్దతు ఇచ్చాం.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ దే అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఎన్నికలు జరగకుండా ఉండేందుకు జరిగే ఎత్తుగడే ఈ మోసమని ఆయన ఆరోపించారు.
Also Read
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
తమిళనాడు తీర్పు నేపథ్యంలో …తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టే పరిస్థితి లేదని, పార్టీ క్రమశిక్షణ దాటితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు రామచందర్రావు. నాయకులందరూ పార్టీ విధానాలకు లోబడే పని చేయాలని, ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాంగ్రెస్లో రేవంత్ రాజగోపాల్ రెడ్డి మధ్య సమస్యలు.. బీఆర్ఎస్ లో కవితకు పార్టీకి మధ్య గొడవలు ఉన్నాయన్నారు. ప్రతి పార్టీలోనూ గొడవలు ఉన్నాయి వాటిని అంతర్గతంగా పరిష్కరించుకుంటామన్నారు.
Natti Kumar : ఫిష్ వెంకట్ కు హీరోలు ఎందుకు సాయం చేయాలి.. నిర్మాత కామెంట్స్..
తాజావార్తలు
-
Tom Cruise: గుర్తుపట్టలేనంతగా మారిన టామ్ క్రూజ్.. ‘డిగ్గర్’ ట్రైలర్లో షాకిచ్చిన లుక్!
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
-
JR NTR Office : ‘RAW NTR’ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!