Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
- ₹2,194 కోట్ల మెగా ప్రాజెక్టుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్
- ఏడాదికి 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
- 5,500 మందికి ఉపాధి భరోసా.. రీజియన్కు 25 ఏళ్ల జీవితం
- పర్యావరణహిత టెక్నాలజీతో మైనింగ్.. ఎన్టీపీసీకి ఇంధన బలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singareni : సింగరేణి కాలరీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామగుండం (ఆర్జీ) కోల్ మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ నుండి ప్రాథమిక అనుమతులు లభించాయి. సుమారు ₹2,194.05 కోట్ల భారీ అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు, సింగరేణి చరిత్రలోనే ఒక విప్లవాత్మక అడుగుగా నిలవనుంది. మొత్తం 4326 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ మెగా ప్రాజెక్టు ద్వారా దాదాపు 314.98 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వెలికి తీయడమే ప్రధాన లక్ష్యంగా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ ప్రాజెక్టు సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా ఏడాదికి 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, రెండు ఓపెన్ కాస్ట్ గనులు , మూడు భూగర్భ గనులను కలిపి ఒకే విశిష్ట ప్రాజెక్టుగా దీనిని రూపొందించారు. ఇందులో భాగంగా ఓపెన్ కాస్ట్ ప్రాంతం నుంచి 182.28 మిలియన్ టన్నులు, భూగర్భ ప్రాంతం నుంచి 132.70 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయనున్నారు. గతంలో మూతపడిన జీడీకే-10 , వకీల్పల్లి గనులను ఇప్పుడు ఓపెన్ కాస్ట్గా మార్చి బొగ్గు తవ్వకాలు జరపడం ద్వారా పాత గనులకు కొత్త జీవం పోస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
- KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
ఈ సరికొత్త ప్రాజెక్టు వల్ల రామగుండం రీజియన్కు మరో 25 ఏళ్ల సుదీర్ఘ జీవితకాలం లభించనుంది. పాత గనులు క్రమంగా మూతపడుతున్న తరుణంలో, అక్కడ పనిచేస్తున్న సుమారు 5,500 మంది ఉద్యోగులకు , కార్మికులకు ఈ ప్రాజెక్టు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. దీనివల్ల కార్మికుల భవిష్యత్తుకు భరోసా లభించడమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం కానుంది. తక్కువ పెట్టుబడులతోనే గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేసేలా సింగరేణి యాజమాన్యం పకడ్బందీ ప్రణాళికలను అమలు చేస్తోంది.
పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ప్రాజెక్టులో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. తవ్వకాల ప్రక్రియలో భాగంగా వచ్చే ఓవర్బర్డెన్ మట్టిని బయట పారబోయకుండా, తిరిగి ఖాళీ క్వారీల్లోనే నింపే పర్యావరణహిత విధానాన్ని (Backfilling) ఇక్కడ అనుసరించనున్నారు. ఇందుకోసం షావెల్-డంపర్, లాంగ్వాల్ , కంటిన్యూయస్ మైనర్ వంటి అధునాతన టెక్నాలజీలను వాడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లభించే బొగ్గు ఎన్టీపీసీ రామగుండం వంటి భారీ విద్యుత్ కేంద్రాలకు , ఇతర బొగ్గు ఆధారిత పరిశ్రమలకు నిరంతర ఇంధన సరఫరాను అందిస్తుంది. తద్వారా సింగరేణి-ఎన్టీపీసీ మధ్య ఉన్న దశాబ్దాల నాటి వ్యాపార బంధం ఈ ఆర్జీ కోల్ మైన్ ప్రాజెక్టుతో మరింత బలోపేతం కానుంది.
తాజావార్తలు
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?