Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
- ₹2,194 కోట్ల మెగా ప్రాజెక్టుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్
- ఏడాదికి 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
- 5,500 మందికి ఉపాధి భరోసా.. రీజియన్కు 25 ఏళ్ల జీవితం
- పర్యావరణహిత టెక్నాలజీతో మైనింగ్.. ఎన్టీపీసీకి ఇంధన బలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singareni : సింగరేణి కాలరీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామగుండం (ఆర్జీ) కోల్ మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ నుండి ప్రాథమిక అనుమతులు లభించాయి. సుమారు ₹2,194.05 కోట్ల భారీ అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు, సింగరేణి చరిత్రలోనే ఒక విప్లవాత్మక అడుగుగా నిలవనుంది. మొత్తం 4326 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ మెగా ప్రాజెక్టు ద్వారా దాదాపు 314.98 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వెలికి తీయడమే ప్రధాన లక్ష్యంగా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ ప్రాజెక్టు సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా ఏడాదికి 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, రెండు ఓపెన్ కాస్ట్ గనులు , మూడు భూగర్భ గనులను కలిపి ఒకే విశిష్ట ప్రాజెక్టుగా దీనిని రూపొందించారు. ఇందులో భాగంగా ఓపెన్ కాస్ట్ ప్రాంతం నుంచి 182.28 మిలియన్ టన్నులు, భూగర్భ ప్రాంతం నుంచి 132.70 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయనున్నారు. గతంలో మూతపడిన జీడీకే-10 , వకీల్పల్లి గనులను ఇప్పుడు ఓపెన్ కాస్ట్గా మార్చి బొగ్గు తవ్వకాలు జరపడం ద్వారా పాత గనులకు కొత్త జీవం పోస్తున్నారు.
Also Read
- Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ఈ సరికొత్త ప్రాజెక్టు వల్ల రామగుండం రీజియన్కు మరో 25 ఏళ్ల సుదీర్ఘ జీవితకాలం లభించనుంది. పాత గనులు క్రమంగా మూతపడుతున్న తరుణంలో, అక్కడ పనిచేస్తున్న సుమారు 5,500 మంది ఉద్యోగులకు , కార్మికులకు ఈ ప్రాజెక్టు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. దీనివల్ల కార్మికుల భవిష్యత్తుకు భరోసా లభించడమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం కానుంది. తక్కువ పెట్టుబడులతోనే గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేసేలా సింగరేణి యాజమాన్యం పకడ్బందీ ప్రణాళికలను అమలు చేస్తోంది.
పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ప్రాజెక్టులో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. తవ్వకాల ప్రక్రియలో భాగంగా వచ్చే ఓవర్బర్డెన్ మట్టిని బయట పారబోయకుండా, తిరిగి ఖాళీ క్వారీల్లోనే నింపే పర్యావరణహిత విధానాన్ని (Backfilling) ఇక్కడ అనుసరించనున్నారు. ఇందుకోసం షావెల్-డంపర్, లాంగ్వాల్ , కంటిన్యూయస్ మైనర్ వంటి అధునాతన టెక్నాలజీలను వాడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లభించే బొగ్గు ఎన్టీపీసీ రామగుండం వంటి భారీ విద్యుత్ కేంద్రాలకు , ఇతర బొగ్గు ఆధారిత పరిశ్రమలకు నిరంతర ఇంధన సరఫరాను అందిస్తుంది. తద్వారా సింగరేణి-ఎన్టీపీసీ మధ్య ఉన్న దశాబ్దాల నాటి వ్యాపార బంధం ఈ ఆర్జీ కోల్ మైన్ ప్రాజెక్టుతో మరింత బలోపేతం కానుంది.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!