రాజేంద్రనగర్లో బాలుడు మృతిపై బిగ్ ట్విస్ట్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నాలుగు రోజుల క్రితం రాజేంద్రనగర్ హైదర్గూడలో అదృశ్యమైన బాలుడు అనీష్ కుమార్ మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అనీష్ కుమార్ ది ముమ్మాటికి హత్యేనని అంటున్నారు.గురువారం మధ్యాహ్నం అదృశ్యమైన అనీష్ కుమార్ కోసం చుట్టు పక్కల మొత్తం వెతికారు. బాలుడి మృతదేహం లభించిన నీళ్ల కుంట వద్ద కూడా పోలీసులతో ముందు రోజే గాలించారు. అక్కడ బాలుడికి సంబంధించిన ఏలాంటి ఆనవాలు లభించలేదు. కానీ మరుసటి రోజు మృతదేహం నీళ్ల కుంట లోకి ఏలా వచ్చింది? గురువారం గట్టుపై కనిపించని టీ షర్టు శుక్రవారం రోజు ఏలా వచ్చింది? కుటుంబసభ్యుల అనుమానాలకు సమాధానం మాత్రం లభించట్లేదు.
తన మనవడిని ఎవరో పొట్టన పెట్టుకున్నారని అంటున్నారు బాలుడి తాత. చిత్ర హింసలు పెట్టి హత్య చేసారని వాపోయాడు. ముఖం పై గాయాలు ఉన్నాయని.. కన్ను గుడ్డును తీవ్రంగా గాయపర్చారని చెప్పాడు. నోట్లో యాసిడ్ పోసారని ఆరోపిస్తున్నాడు.అపార్ట్మెంట్లో గత వారం రోజులుగా సీసీ కెమెరాలు పని చేయకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుందంటున్నాడు తండ్రి శివశంకర్. అదృశ్యం అయిన రోజే కొత్త సెక్యూరిటీ గార్డు వచ్చాడని.. అదే రోజు సెక్యూరిటీ గార్డు మారడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. తన కుమారుడి మరణం పై లోతుగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసాడు. పోలీసులు బాలుడి మృతిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. వారి అనుమానాలను పోలీసులు ఎలా నివృత్తి చేస్తారో చూడాలి.
Also Read
- Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
- CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్లో సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం