CM Revanth: వేములవాడలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం..
- వేములవాడలో రూ. 679 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం
- పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు
- రూ. 236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
- రూ. 166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
- రూ. 50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణం
- రూ. 47 కోట్ల 85 లక్షలతో మూల వాగు నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన
- రూ. 42 కోట్లతో రుద్రంగి మండలంలో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేములవాడలో రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు. రూ.236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. రూ.166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. రూ.50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణం.. రూ.47 కోట్ల 85 లక్షలతో మూల వాగు నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన.. రూ.42 కోట్లతో రుద్రంగి మండలంలో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే.. రూ.28 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. వేములవాడ పట్టణంలో రూ.కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, రూ.4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రారంభోత్సవం.. రూ.3 కోట్ల 80 లక్షలతో వేములవాడ పట్టణంలో మురుగు కాల్వ పనులకు శంకుస్థాపన.. వీర్నపల్లిలో కోటి యాభై లక్షలతో పి.హెచ్.సి నిర్మాణం, మేడిపల్లిలో రూ.5 కోట్లతో జూనియర్ కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా.. ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ సేకరణకు రూ. 5 కోట్ల, కాళేశ్వరం ప్యాకేజీ 9 పనులకు రూ.11 కోట్ల 79 లక్షలు నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు.
Police Notice to RGV: ఆర్జీవీకి మళ్లీ పోలీసుల నోటీసు.. 25న విచారణకు రండి..
Also Read
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Vemulawada Rajanna Temple : వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. శరవేగంగా అభివృద్ధి పనులు..
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
మంత్రి పొన్నం ప్రభాకర్..
భవిషత్ తరాల కోసం నిత్యాన్నదానసత్రం కోసం రూ.35 కోట్లు సీఎం మంజూరు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆనాడు కేసీఆర్ శివుడికి శఠగోపం పెట్టారని అన్నారు. వేములవాడ రాజన్నకు నిధులు ఇచ్చిన క్యాబినెట్ మంత్రులకు ధన్యవాదములు.. కేసీఆర్ రాజన్న గుడి తంతేలా మీద ఇచ్చిన మాట మర్చిపోయారు.. ముంపు గ్రామాల ప్రజలకి న్యాయం జరగాలని తాము ఇచ్చిన మాట నెరవేర్చమని మంత్రి పేర్కొన్నారు. నేతన్నల సంక్షేమమే తమకు ముఖ్యమని తెలిపారు. నేతన్నలకి యారన్ డిపో సీఎం మంజూరు చేశారు.. నిరంతరంగా పేద ప్రజలకు అన్నదానం ఉండాలని తమ ధ్యేయమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు..
పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి వచ్చారు.. ఏడాది కాకముందే రేవంత్ రెడ్డి సీఎం హోదాలో నెరవేర్చారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే నాలుగేళ్లలో మిగిలిపోయిన ప్రతి పని పూర్తి చేస్తాం.. ఆర్థిక క్రమశిక్షణతో ప్రజలకు వాగ్దానాలను చేస్తున్నాం.. సిరిసిల్ల నియోజకవర్గంకి సంబంధించిన యర్న్ డిపోను తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. రైతు సోదరులు, నేతన్నలకి అండగా ఉంటాం.. ఇచ్చిన మాట తీరుస్తామన్నారు. సాగునీటి విషయంలో శ్రీ పాద ఎల్లంపల్లి కట్టింది, మిడ్ మనేరు కట్టింది తామేనని పేర్కొన్నారు. ప్రతి రైతు సాగుకి నీరు అందిస్తాం.. వేములవాడలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్ చేస్తుందని మంత్రి తెలిపారు.
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
మాది చేతల ప్రభుత్వం, గత ప్రభుత్వంకి మా ప్రభుత్వం తేడా మీరే చూడాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట దోపిడీ జరిగింది.. ఈ ప్రాంతాల్లో పదేళ్లలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి.. ఆనాటి పాలకుల హామీలు హామీలుగానే మిగిలిపోయాయని ఆరోపించారు. కాంగ్రెస్ కు జనాలు అండగా ఉండాలని కోరారు.
తాజావార్తలు
-
MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
-
Calorie Deficit: బరువు తగ్గే డైట్లో ఆకలి ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
-
Karnataka: ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం.. పోలీసుల గాలింపు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!