CM Revanth: వేములవాడలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం..
- వేములవాడలో రూ. 679 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం
- పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు
- రూ. 236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
- రూ. 166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
- రూ. 50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణం
- రూ. 47 కోట్ల 85 లక్షలతో మూల వాగు నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన
- రూ. 42 కోట్లతో రుద్రంగి మండలంలో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేములవాడలో రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు. రూ.236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. రూ.166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. రూ.50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణం.. రూ.47 కోట్ల 85 లక్షలతో మూల వాగు నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన.. రూ.42 కోట్లతో రుద్రంగి మండలంలో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే.. రూ.28 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. వేములవాడ పట్టణంలో రూ.కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, రూ.4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రారంభోత్సవం.. రూ.3 కోట్ల 80 లక్షలతో వేములవాడ పట్టణంలో మురుగు కాల్వ పనులకు శంకుస్థాపన.. వీర్నపల్లిలో కోటి యాభై లక్షలతో పి.హెచ్.సి నిర్మాణం, మేడిపల్లిలో రూ.5 కోట్లతో జూనియర్ కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా.. ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ సేకరణకు రూ. 5 కోట్ల, కాళేశ్వరం ప్యాకేజీ 9 పనులకు రూ.11 కోట్ల 79 లక్షలు నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు.
Police Notice to RGV: ఆర్జీవీకి మళ్లీ పోలీసుల నోటీసు.. 25న విచారణకు రండి..
Also Read
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Vemulawada Rajanna Temple : వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. శరవేగంగా అభివృద్ధి పనులు..
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
మంత్రి పొన్నం ప్రభాకర్..
భవిషత్ తరాల కోసం నిత్యాన్నదానసత్రం కోసం రూ.35 కోట్లు సీఎం మంజూరు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆనాడు కేసీఆర్ శివుడికి శఠగోపం పెట్టారని అన్నారు. వేములవాడ రాజన్నకు నిధులు ఇచ్చిన క్యాబినెట్ మంత్రులకు ధన్యవాదములు.. కేసీఆర్ రాజన్న గుడి తంతేలా మీద ఇచ్చిన మాట మర్చిపోయారు.. ముంపు గ్రామాల ప్రజలకి న్యాయం జరగాలని తాము ఇచ్చిన మాట నెరవేర్చమని మంత్రి పేర్కొన్నారు. నేతన్నల సంక్షేమమే తమకు ముఖ్యమని తెలిపారు. నేతన్నలకి యారన్ డిపో సీఎం మంజూరు చేశారు.. నిరంతరంగా పేద ప్రజలకు అన్నదానం ఉండాలని తమ ధ్యేయమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు..
పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి వచ్చారు.. ఏడాది కాకముందే రేవంత్ రెడ్డి సీఎం హోదాలో నెరవేర్చారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే నాలుగేళ్లలో మిగిలిపోయిన ప్రతి పని పూర్తి చేస్తాం.. ఆర్థిక క్రమశిక్షణతో ప్రజలకు వాగ్దానాలను చేస్తున్నాం.. సిరిసిల్ల నియోజకవర్గంకి సంబంధించిన యర్న్ డిపోను తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. రైతు సోదరులు, నేతన్నలకి అండగా ఉంటాం.. ఇచ్చిన మాట తీరుస్తామన్నారు. సాగునీటి విషయంలో శ్రీ పాద ఎల్లంపల్లి కట్టింది, మిడ్ మనేరు కట్టింది తామేనని పేర్కొన్నారు. ప్రతి రైతు సాగుకి నీరు అందిస్తాం.. వేములవాడలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్ చేస్తుందని మంత్రి తెలిపారు.
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
మాది చేతల ప్రభుత్వం, గత ప్రభుత్వంకి మా ప్రభుత్వం తేడా మీరే చూడాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట దోపిడీ జరిగింది.. ఈ ప్రాంతాల్లో పదేళ్లలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి.. ఆనాటి పాలకుల హామీలు హామీలుగానే మిగిలిపోయాయని ఆరోపించారు. కాంగ్రెస్ కు జనాలు అండగా ఉండాలని కోరారు.
తాజావార్తలు
-
2027 World Cup: : పంత్, శాంసన్లకు నో ఛాన్స్.. అశ్విన్ ప్రకటించిన జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!