Rajagopal Reddy: ఆ ప్రచారాలు నమ్మొద్దు.. పార్టీ మార్పుపై రాజగోపాల్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajagopal Reddy Gives Clarity On Party Change: పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్లో చేరుతున్నానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానని.. ఊహాగానాలను, ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. తాను ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. పార్టీ మారుతున్నట్టు తనపై ప్రచారాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని అన్నారు. పార్టీ మార్పుపై తాము ఏదైనా నిర్ణయం తీసుకుంటే, తామే స్వయంగా మీడియాకి చెప్తాం కదా! అని పేర్కొన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని.. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యం బతకాలంటే, అది ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీతోనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతోనే తాను ఆ పార్టీలోకి చేరానని చెప్పారు. కేసీఆర్ కుటుంబం అవినీతి బయటపడాలన్నా, రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు బాగు పడాలన్నా.. అది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని అన్నారు.
Parshottam Rupala: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. కేంద్రమంత్రి రూపాల
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
అలాగే.. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసినప్పుడు, తాను తన అభిప్రాయాలను తెలుపుతానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేని చెప్పారు. కవితను అరెస్ట్ చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అయితే కవిత అరెస్ట్, ఈడీ కేసుల వ్యవహారంలో నాన్చుడు జరుగుతుండటంతో.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అండర్స్టాండింగ్ ఉందని ప్రజలంతా అనుకుంటున్నారన్నారు. ఈ విషయంపై కూడా తాను అధిష్టానంతో మాట్లాడుతానన్నారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని.. ఇందులో భాగంగానే కేటీఆర్కు కేంద్రమంత్రులు అపాయింట్మెంట్ ఇస్తున్నారని వెల్లడించారు. కేటీఆర్, కేంద్రమంత్రుల భేటీని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని సూచించారు. కాగా.. బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ఈటల రాజేందర్తో కలిసి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ బయల్దేరిన విషయం తెలిసిందే.
Telangana Slang: మొన్న బాలయ్య, ఇప్పుడు చిరు.. తెలంగాణ యాసలో రచ్చ లేపుడే!
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!