Rains in Telangana: తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు.. హైదరాబాద్కు సూచన లేదా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rains in Telangana: మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ చిలిపిగా పలకరించింది. తెలంగాణలో నేటి నుంచి అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. వివిధ జిల్లాల్లో మూడు రోజులుగా వర్షాలు కురిసినా.. హైదరాబాద్ లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. దీంతో హైదరాబాద్ లో మాత్రం వాతావరణంలో మార్పులు ఉండవని తెలుస్తోంది. ఎప్పటిలాగానే ఎండలు మాత్రం కొనసాగుతాయి. ఇక 7, 8 తేదీల్లో తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
Read also: Congress Janajatara: నేడు కాంగ్రెస్ జనజాతర.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
Also Read
ఇక ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో సోమవారం వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో 43 డిగ్రీలకు పైగా ఎండలు నమోదవుతున్నందున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించింది. 7వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో శనివారం వడగళ్ల వాన కురుస్తుంది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో ఆదివారం ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Prasanth Varma : జై హనుమాన్ అన్నారు కద సార్.. ఇదేంటి ఇప్పుడు?
తాజావార్తలు
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!