Congress Janajatara: నేడు కాంగ్రెస్ జనజాతర.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Janajatara: తుక్కుగూడలో ఇవాళ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో పాల్గొనే ప్రజలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. చాలా చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాచకొండ సీపీ తరుణ్ జోషి వాహనదారులకు పలు సూచనలు చేశారు. వాహనదారులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిబంధనలు పాటించాలన్నారు. ఖమ్మం, నల్గొండ నుంచి విజయవాడ హైవే మీదుగా వచ్చే వాహనదారులు లేదా పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ లేదా సర్వీస్ రోడ్డు నుంచి బెంగళూరు టోల్కు వెళ్లే వాహనదారులు రావిర్యాల టోల్ వద్ద ఎడమవైపు తిరిగి ఫ్యాబ్సిటీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్కు చేరుకోవాలి.
Read also: Earthquake: అమెరికాలో మరోసారి భూప్రకంపనలు
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
మాల్, ఇబ్రహీపట్నం, నాగార్జున సాగర్ హైవే, మహబూబ్నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఓఆర్ఆర్ బెంగళూరు టోల్ నుంచి రావిర్యాల టోల్ నుంచి ఫ్యాబ్సిటీ వద్ద పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. బెంగుళూరు జాతీయ రహదారి 44 నుండి వచ్చే వాహనాలు పాలమాకుల, స్వర్ణ భారతి ట్రస్ట్, పెద్ద గోల్కొండ సర్వీస్ రోడ్ నుండి ఓల్డ్ PM మీటింగ్ ప్లేస్ వద్ద ఉన్న పార్కింగ్ స్థలాన్ని ఉపయోగించాలి. జహీరాబాద్ నుంచి వచ్చే వాహనాలు పటాన్చెరు నుంచి గచ్చిబౌలి, శంషాబాద్ మీదుగా పెద్ద గోల్కొండ వద్ద దిగి ఓల్డ్ పీఎం సమావేశ స్థలంలో పార్కింగ్ చేయాలి. వరంగల్ నుంచి వచ్చే వాహనాలు ఘట్కేసర్ ఓఆర్ఆర్ మీదుగా రావిర్యాల వద్ద దిగి ఫ్యాబ్సిటీలో ఏర్పాటు చేసిన పార్కింగ్ వద్ద వాహనాలను పార్కింగ్ చేయాలన్నారు.
Read also: Komaram Bheem: సరిహద్దు దాటిన ఏనుగు.. 53 గంటల పాటు తెలంగాణలో సంచారం
సిద్దిపేట నుంచి వచ్చే వాహనాలు సమీర్పేట మీదుగా రావిర్యాలకు చేరుకుని ఫ్యాబ్సిటీ వద్ద పార్కింగ్కు చేరుకోవాలి. శ్రీశైలం వైపు వెళ్లే సాధారణ వాహనాలు రావిర్యాల గ్రామం నుంచి ఎడమ మలుపు తిరిగి ఆగాఖాన్ అకాడమీ, విజయదెయిరి, గాంధీ బొమ్మ, రావిర్యాల, వండర్ల జంక్షన్, తిమ్మాపూర్, రాచులూరు గేటు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. శ్రీశైలం రోడ్డు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వారు మహేశ్వరం గేటు వద్ద ఎడమవైపు తిరిగి మన్సానపల్లె, నాగారం, పెద్ద గోల్కొండ మీదుగా శంషాబాద్ చేరుకోవాలి. సమావేశం నేపథ్యంలో తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద సాధారణ వాహనాలను దిగేందుకు అనుమతి లేదన్నారు. పెద్ద అంబర్పేట నుంచి పెద్దగోల్కొండ రహదారిపై సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాధారణ వాహనాలను అనుమతించరని సచించారు.
Weight Loss : త్వరగా బరువు తగ్గాలంటే వీటిని రోజూ తినాల్సిందే..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..