రైల్వే ప్రయాణికులతో పాటు స్టేషన్కు వెళ్లేవారికి.. రైళ్లలో వచ్చేవారిని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కు వెళ్లేవారికి గుడ్న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. తాత్కాలికంగా పెంచిన ప్లాట్ఫారమ్ టికెట్ ధరను సికింద్రాబాద్ డివిజన్లోని అన్ని రైల్వే స్టేషన్లలో తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.. కరోనా మహమ్మారి కారణంగా గతంలో నిలిపేసిన ప్లాట్ఫారమ్ టికెట్ల జారీ మళ్లీ పునరుద్ధరించారు అధికారులు… జోన్ నెట్వర్క్లో అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ రైళ్లు పునరుద్ధరించిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. సికింద్రాబాద్ డివిజన్లోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫారమ్ టికెట్ ధరల తగ్గింపుతో.. ఇప్పుడు రూ.10 మాత్రమే వసూలు చేయనున్నారు.. అయితే, సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో మాత్రం ఈ ధర రూ.20గా ఉండనుంది. కాగా, రద్దీ ఎక్కువగా ఉన్న సీజన్లో ప్రతీసారి.. రైల్వేశాఖ ప్లాట్ ఫారమ్ టికెట్ల ధరలను పెంచుతున్న విషయం విదితమే.