Rahul Gandhi: రేపు రాష్ట్రానికి రాహుల్ గాంధీ.. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సాహం నింపేందుకు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు (ఈ నెల 17న) రాష్ట్రానికి రానున్న ఆయన ఒకేరోజు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుఫాన్ పర్యటన చేయనున్నారు. రాహుల్ ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక చేరుకుంటారు. అక్కడ కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నర్సంపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు అక్కడే ప్రచారం నిర్వహించి రోడ్డు మార్గంలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పాదయాత్రగా పశ్చిమ నియోజకవర్గానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వీధి సభలో ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో సాయంత్రం 6:30 గంటలకు రాజేంద్రనగర్ చేరుకుంటారు. అక్కడ సమావేశానికి హాజరైన తర్వాత ఆయన ఢిల్లీ వెళతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటి వరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు రోజుకు గరిష్టంగా మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. రాహుల్ గాంధీ ఒకేరోజు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించడం గమనార్హం.
21వ తేదీ తర్వాత ప్రచారం…
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
తెలంగాణ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ఈ నెల 21తో ముగియనుంది. దీని తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణలో ఐదు రోజుల పాటు ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కనీసం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఇతర ఏఐసీసీ అగ్రనేతలు కూడా 21 తర్వాత తమ పూర్తి సమయాన్ని తెలంగాణకే కేటాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Annavaram EO Transfer: అన్నవరం దేవస్థానం ఈవో ఆకస్మిక బదిలీ
తాజావార్తలు
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
-
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
-
Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!