Rahul Gandhi: బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలాడుతూ.. ప్రజల్ని మభ్యపెడుతున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Fires On PM Narenda Modi & CM KCR: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అన్ని విషయాల్లోనూ ఒకదానికి మరొకటి సహకరించుకుంటున్నాయని.. ఆ రెండు పార్టీలు కలిసి డ్రామాలాడుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చేరుకున్న ఆయన.. అక్కడ నిర్వహించిన సభలో మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మన దేశంలో హింస, ద్వెషాన్ని పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి, విభజించు పాలించు చేస్తున్నాయని చెప్పారు. అయితే.. తమ భారత్ జోడో యాత్రలో ద్వేషానికి ఎలాంటి తావు లేదన్నారు. లక్షలాది మంది ఎంతో ప్రేమ, ఆప్యాయతతో తన యాత్రను స్వాగతిస్తున్నారన్నారు. కాలుష్యంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటే.. అవినీతిలో తెలంగాణ ముందుందని తెలిపారు.
తెలంగాణలో తాను ఏడు రోజుల్లో అనేక వర్గాలతో మాట్లాడానని, ఎవరిని కదిలించినా సమస్యలతో కన్నీరు పెడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నానని, సాగు లాభదాయకంగా లేక వందలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకోవాలన్నా, వినాలన్నా కేసీఆర్కి ఓపిక లేదని దుయ్యబట్టారు. ఉన్నత చదువులు చదివిన యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. పెద్ద చదువులు చదివినా.. ఉద్యోగాలు లేక స్విగ్గీ, జోమటో లాంటి వాటిల్లో పనులు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని విమర్శించారు. మోడీ తెచ్చిన నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల చిన్న, మధ్య తరహా వ్యాపారులు రోడ్డున పడ్డారన్నారు. ఢిల్లీలో మోడీ తన ఇద్దరు మిత్రులకు దేశం మొత్తాన్ని రాసిచ్చేశారని మండిపడ్డారు. పోర్టులు, విమానాశ్రయాలు, టెలికాం, ఎల్ఐసీ ఇలా అన్నీ అమ్మేస్తున్నారని మండిపడ్డారు.
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
ధరణి పోర్టల్ను ప్రతిరోజు రాత్రి కేసీఆర్ చెక్ చేసుకుంటారని.. కమీషన్లు లేనిదే ఆయన కాంట్రాక్టులు చేయరని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోడీ పుణ్యమా అని.. రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ రూ.1200కి చేరిందన్నారు. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల సామాన్యులు చితికిపోతున్నారన్నారు. చిన్న వ్యాపారులు లోన్ కావాలంటే బ్యాంకులు ఇవ్వట్లేదని.. వేల కోట్లు ఎగ్గొట్టే వాళ్ళకి మాత్రం ఎలాంటి హామీ లేకుండా ఇచ్చేస్తారని ఆగ్రహించారు. హైదరాబాద్ ప్రజలు చూపిన ప్రేమ, ఉత్సాహం తాను ఎప్పటికీ మరువలేనన్నారు. దేశంలోనే హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిటీగా పేరుగాంచిందన్నారు. సంస్కృతి, సంప్రదాయం అనేవి.. తెలంగాణ డీఎన్ఏలోనే ఉన్నాయని కితాబిచ్చారు.
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..