Priyanka Gandhi: రేపు రాష్ట్రానికి ప్రియాంక గాంధీ.. చేవెళ్ల గడ్డపై రెండు పథకాలు అమలుకు రంగం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi:తెలంగాణ రాష్ట్రానికి రేపు (27వ) తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ రానున్నారు. రేపు చేవెళ్లలో జరిగే ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్రెడ్డి, వికారాబాద్ జిల్లా చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా చేవెళ్ల గడ్డ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల వైద్యసేవలు వంటి పథకాలు పేదల జీవితాల్లో ఆర్థికంగా ఊరటనిస్తాయని తెలిపారు. ఈ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి మన జిల్లాకు వస్తున్నందున ఈ సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలని కోరారు.
Read also: Pakistan: ఖురాన్ కు విరుద్దంగా మహిళ డ్రెస్.. దాడికి పాల్పడిన యువకులు
Also Read
- Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ఈ పథకాలు ఎక్కువగా మహిళలకు సంబంధించినవని, ఈ సభకు మహిళలు పెద్దఎత్తున తరలిరావాలని సూచించారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని, ఎన్నికల తర్వాత మన జిల్లాలో బీఆర్ ఎస్ కు అడ్రస్ ఉండదన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరాలని పిలుపునిచ్చారు. అనంతరం సభ జరిగిన మైదానాన్ని ప్రియాంక గాంధీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భీమ్ భరత్, సేరిలింగంపల్లి ఇన్చార్జి జగదీశ్వర్గౌడ్, మహేశ్వరం, రాజేంద్రనగర్ ఇన్చార్జిలు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చేవెళ్లకు ప్రియాంక గాంధీ రానున్న సందర్భంగా.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావులేకుండా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ప్రియాంక గాంధీ చేవెళ్ల రానున్న సందర్భంగా.. ట్రాఫిక్ ఆంక్షలుఉంటాయని అధికారులు వెల్లడించారు.. ప్రజలు సహకరించాలని తెలిపారు.
Kalki 2898AD : ‘కల్కి 2898AD’ సినిమా సీక్రెట్ ను రీవిల్ చేసిన డైరెక్టర్..
తాజావార్తలు
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..