Prakash Reddy : మీరు ఉక్కు ఫ్యాక్టరీ కడతామంటే ఎవరొద్దన్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే ఎవరు అడ్డుకున్నారు.? బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాశ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఓ పత్రికా ప్రకటనల విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారిపై నిందలు ఆపండని ఆయన అన్నారు. విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పరిశీలిస్తామన్న హామీ మాత్రమే ఉందని, 2014లో నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రధాన డిమాండ్ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంశంపై కమిటీని నియమించిందని ఆయన తెలిపారు. బయ్యారం సమీపంలోని ప్రాంతాలను పరిశీలించిన కమిటీ.. ఇక్కడి ఇనుప ఖనిజంతో ఉక్కు తయారీ లాభసాటి కాదని తేల్చిందన్నారు. అంతేకాదు స్టీల్ ధరలన్నీ అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడిన తరుణంలో నష్టాలతో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని నడపడం సాధ్యంకాదన్నారు.
అయినా ఈ విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎప్పుడూ సానుకూలంగానే ఉన్నారన్నారు. కేంద్రం గీంద్రం జాంతానై .. సింగరేణి ఆధ్వర్యంలో మైనింగ్ జేపిచ్చి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభం చేస్తా అని అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చేసిందేం లేదు అని ఆయన విమర్శించారు. మరోవైపు 2018 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే కేంద్ర సహకారం లేకుండానే సింగరేణి, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర వనరులతోనే ప్రారంభం చేసుకుంటామన్న కేసీఆర్ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు.
Also Read
- Alprazolam Seizure : సైబరాబాద్లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
- Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్ను చంపేశారు
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?