Telangana Elections 2023: బోధన్ లో పోస్టర్ల కలకలం.. సంచలనం సృష్టిస్తున్న ఫోటోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుండగా.. చివరి రోజుల్లో నేతల ప్రచారంతో తెలంగాణ పల్లెలు, పట్టణాలు హోరెత్తుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం (నవంబర్ 25, 2023) తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ముగ్గురు బీజేపీ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ఈ ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లు పాల్గొననున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఏమాత్రం తగ్గకుండా దూకుడు పెంచింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పవర్ టూర్లలో బిజీబిజీగా ఉన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఇవాళ ప్రచారం చేయనున్నారు. ఇదిలా ఉండగా… ఇవాళ రాహుల్ గాంధీ నిజామాద్ బోధన్లో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో బోధ్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రాలతో కూడిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
Read also: Revanth Reddy: కేసీఆర్ ఓటుకి 10వేలు పంపాడు.. తక్కువ ఇస్తే అంగీ లాగు గుంజుకొండి
Also Read
పోస్టర్లపై రాహుల్, రేవంత్ చిత్రాలను ముద్రించి ‘మా పిల్లల చావుకు కాంగ్రెస్సే కారణం’ అని రాశారు. అంతేకాదు, కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ బోధ్ టూర్కు వ్యతిరేకంగా పోస్టర్ కలకలం సృష్టించింది. తెలంగాణలో చాలా మంది బలిదానాలకు కాంగ్రెస్సే కారణమని పేర్కొన్నారు. కర్ణాటకలో ఉద్యోగాలు లేవని, ఉరివేసుకున్నారని రాశారు. కాంగ్రెస్ కు ఓటు వేసిన పాపానికి నిరుద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారని పోస్టర్లలో ముద్రించారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమాగా ఉన్న నేతలు బీజేపీ, బీఆర్ఎస్ లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరు పార్టీలు తమ నేతలు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు సంస్థలపై దాడులు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పై బీఆర్ ఎస్, బీజేపీ కుట్ర పన్నుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్, సీఎం కేసీఆర్పై ఎన్నికల్లో పోటీకి ఓకే చెప్పిన రేవంత్ రెడ్డి పోస్టర్లు కామారెడ్డిలో కలకలం రేపుతున్నాయి. ఈ పోస్టర్లు కూడా కుట్రలో భాగమేనని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
Golden Horses: బంగారు గుర్రాల గురించి ఎప్పుడైనా విన్నారా?.. వీటికి పెద్ద చరిత్రే ఉంది..
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!