పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి నాకు ప్రాణహాని ఉంది అని అన్నారు పోసాని కృష్ణ మురళి. అయితే నిన్న పవన్ కళ్యాణ్ పై ప్రెస్ మీట్ పెట్టినందుకు పవన్ ఫ్యాన్స్ నుంచి మెసేజ్లు వస్తున్నాయని పోసాని కృష్ణ మురళి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి విరుకుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ను పవన్ను బండ బూతులు తిట్టారు. అయితే తాజాగా పవన్ అభిమానుల నుండి తనకు ప్రాణహాని ఉంది అని చెప్పిన పోసాని… పవన్ పై రేపు పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని తెలిపారు. అయితే ఇక తనకు ఏం జరిగిన పవన్ దే బాధ్యత అని పోసాని పేర్కొన్నారు. అయితే పవన్ ను ప్రెస్ మీట్ లో పోసాని బూతులు తిట్టడంతో ఆయన పై పవర్ స్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రెస్క్లబ్ వద్దకు చేరుకొని జనసేన కార్యకర్తలు ఆందోళన చేసారు. పోసాని ప్రెస్మీట్ను అడ్డుకునే ప్రయత్నం చేసారు. కానీ జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.