Ponnam Prabhakar: మోడీ ఫోటోతో దేశం అభివృద్ధి కాదు.. పొన్నం ప్రభాకర్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhaskar Counters On PM Narendra Modi: ప్రధాని మోడీ ఫోటోతో దేశం అభివృద్ధి కాదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మిత్ర పక్షాలను చీల్చడం, వారిని బలహీనపరచడమే బీజేపీ పని అని మండిపడ్డారు. మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికే మోడీ మీటింగ్ పెట్టారని అన్నారు. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాదని.. నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదానీ అని దుయ్యబట్టారు. లోకసభలో ప్రాధాన్యత లేనివాళ్ళు బీజేపీకి మిత్ర పక్షాలని ఎద్దేవా చేశారు. తాను బీసీ అని చెప్పుకునే ప్రధాని మోడీ.. బీసీ గణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ‘చక్ దే ఇండియా’ అంటూ కాంగ్రెస్ మిత్రపక్షాలు ముందుకు వెళ్తున్నాయని చెప్పారు.
Sad Incident: చేతుల్లో నుంచి జారీ డ్రైనేజీలో పడ్డ 4 నెలల పసికందు.. బోరున విలపిస్తున్న తల్లిదండ్రులు
Also Read
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
టీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయిందని.. గోడమీద పిల్లిలాగా ఎవరికీ సపోర్ట్ చేయడం లేదని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. దొరల గడీలు బద్దలుకొట్టడానికి మీటింగ్ పెట్టిన బీసీ నేతలను తాను అభినందిస్తున్నానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఒక్క కేసీఆర్ మాత్రమేనన్నారు. అధికార పార్టీలో బీసీల పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి అయితే.. ప్రచార కమిటీ చైర్మన్ బీసీ అని.. కాంగ్రెస్ పార్టీలో సోషల్ ఇంజనీరింగ్ ఉంటుందని వివరించారు. బలహీన వర్గాల వ్యక్తిని పార్టీ నుండి బయటకి గెంటేసినప్పుడు.. అధికార పార్టీ బీసీ నేతల ఆత్మ గౌరవం ఏమైంది? నిలదీశారు.
Pawan Kalyan Meets Amit Shah: ఢిల్లీలో పవన్ కల్యాణ్ మకాం.. అమిత్షాతో భేటీ
ఇదే సమయంలో మంత్రి గంగుల కమలాకర్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దున్నపోతు కంటే ఏం తక్కువ ఉన్నావ్ అంటూ ధ్వజమెత్తారు. తప్పులు చేస్తూ తప్పించుకోవడానికి.. బీసీల ముసుగు కప్పుకొని ప్రయత్నం ఎందుకు? అని అడిగారు. 2014 నుండి 2023 వరకు బీసీలకు ఇచ్చిన బడ్జెట్ ఎంత? తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ఇచ్చిన బడ్జెట్ ఎంత? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు గౌడ్ ఎమ్మెల్సీలు ఉండేవారని, ఇప్పుడు ఎంతమంది గౌడ్స్ ఉన్నారో శ్రీనివాస్ గౌడ్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కి లేదని ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!