Ponnam Prabhakar: మోడీ ఫోటోతో దేశం అభివృద్ధి కాదు.. పొన్నం ప్రభాకర్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhaskar Counters On PM Narendra Modi: ప్రధాని మోడీ ఫోటోతో దేశం అభివృద్ధి కాదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మిత్ర పక్షాలను చీల్చడం, వారిని బలహీనపరచడమే బీజేపీ పని అని మండిపడ్డారు. మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికే మోడీ మీటింగ్ పెట్టారని అన్నారు. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాదని.. నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదానీ అని దుయ్యబట్టారు. లోకసభలో ప్రాధాన్యత లేనివాళ్ళు బీజేపీకి మిత్ర పక్షాలని ఎద్దేవా చేశారు. తాను బీసీ అని చెప్పుకునే ప్రధాని మోడీ.. బీసీ గణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ‘చక్ దే ఇండియా’ అంటూ కాంగ్రెస్ మిత్రపక్షాలు ముందుకు వెళ్తున్నాయని చెప్పారు.
Sad Incident: చేతుల్లో నుంచి జారీ డ్రైనేజీలో పడ్డ 4 నెలల పసికందు.. బోరున విలపిస్తున్న తల్లిదండ్రులు
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
టీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయిందని.. గోడమీద పిల్లిలాగా ఎవరికీ సపోర్ట్ చేయడం లేదని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. దొరల గడీలు బద్దలుకొట్టడానికి మీటింగ్ పెట్టిన బీసీ నేతలను తాను అభినందిస్తున్నానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఒక్క కేసీఆర్ మాత్రమేనన్నారు. అధికార పార్టీలో బీసీల పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి అయితే.. ప్రచార కమిటీ చైర్మన్ బీసీ అని.. కాంగ్రెస్ పార్టీలో సోషల్ ఇంజనీరింగ్ ఉంటుందని వివరించారు. బలహీన వర్గాల వ్యక్తిని పార్టీ నుండి బయటకి గెంటేసినప్పుడు.. అధికార పార్టీ బీసీ నేతల ఆత్మ గౌరవం ఏమైంది? నిలదీశారు.
Pawan Kalyan Meets Amit Shah: ఢిల్లీలో పవన్ కల్యాణ్ మకాం.. అమిత్షాతో భేటీ
ఇదే సమయంలో మంత్రి గంగుల కమలాకర్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దున్నపోతు కంటే ఏం తక్కువ ఉన్నావ్ అంటూ ధ్వజమెత్తారు. తప్పులు చేస్తూ తప్పించుకోవడానికి.. బీసీల ముసుగు కప్పుకొని ప్రయత్నం ఎందుకు? అని అడిగారు. 2014 నుండి 2023 వరకు బీసీలకు ఇచ్చిన బడ్జెట్ ఎంత? తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ఇచ్చిన బడ్జెట్ ఎంత? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు గౌడ్ ఎమ్మెల్సీలు ఉండేవారని, ఇప్పుడు ఎంతమంది గౌడ్స్ ఉన్నారో శ్రీనివాస్ గౌడ్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కి లేదని ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..