VC Sajjanar: అభిమానం పేరుతో పిచ్చి చేష్టలా.. బస్సులపై దాడి కరెక్ట్ కాదన్న సజ్జనార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC Sajjanar: యూట్యూబర్, రైతు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు. దీనితో, బిగ్ బాస్ చరిత్రలో కామన్మాన్ కేటగిరీలో గెలిచిన మొదటి కంటెస్టెంట్గా రికార్డుల్లో నిలిచాడు. సీరియల్ నటుడు అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ కు అమర్, ప్రశాంత్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రశాంత్ను విజేతగా ప్రకటించగానే సంబరాలు మిన్నంటాయి. అయితే ఇద్దరి అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం పరస్పరం దాడులకు దారితీసింది. ఒకరినొకరు పిడిగుద్దులు కొట్టుకున్నారు. అంతేకాకుండా.. టిఎస్ఆర్టిసికి చెందిన 6 సిటీ బస్సులపై దాడి చేసి వాటి అద్దాలు పగలగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
Read also: Hanuman: శ్రీరాముని ఆశీస్సులు కూడా అందాయి… ఇక ట్రైలర్ రావడమే లేట్
Also Read
సజ్జనార్ ట్విట్..
బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఎఆర్ కూడా నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. TSRTC యాజమాన్యం ఇలాంటి సంఘటనలను ఉపేక్షించదు. TSRTC బస్సులు ప్రజల ఆస్తి. వాటిని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది” అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
ఇదేం అభిమానం!
బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023
తాజావార్తలు
-
Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
-
Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
-
Gold Medal In Glasgow: కామన్వెల్త్ గేమ్స్లో దూసుకుపోతున్న భారత్.. మరో రెండు స్వర్ణాలు సొంతం..
-
Kulgam: కుల్గామ్లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
-
Trump: డెమోక్రాట్లు గెలిస్తే అమెరికాకు అదే గతి.. స్పెయిన్ వలసపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!