Ponguleti Srinivas Reddy : అధిష్టానానికి ఫిర్యాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి
- రూ.70 కోట్ల కాంట్రాక్ట్ కోసం తాపత్రయం లేదన్న మంత్రి పొంగులేటి
- సమ్మక్క సారక్క జాతర అభివృద్ధికి రూ.211 కోట్ల నిధులు
- 90 రోజుల్లో పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం
- ఆది వాసీ సంప్రదాయాలకు విఘాతం లేకుండా నిర్మాణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చారు. తాను ఎలాంటి కాంట్రాక్టు లబ్ధి కోసం తాపత్రయపడే వ్యక్తిని కాదని, రూ.70 కోట్ల కాంట్రాక్ట్ కోసం పరితపించే అవసరం లేదని స్పష్టం చేశారు. “శ్రీనివాస్ రెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసు” అంటూ తాను పారదర్శకంగా వ్యవహరిస్తానని తెలిపారు. సమ్మక్క సారక్క జాతర అభివృద్ధి పనులు మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని, రూ.211 కోట్ల నిధులు ఇప్పటికే కేటాయించామని వెల్లడించారు మంత్రి పొంగులేటి. భక్తుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
Also Read
తనపై సహచర మంత్రులు ఫిర్యాదులు చేశారన్న వార్తలను ఆయన ఖండించారు. “నామీద ఫిర్యాదు చేయడానికి అసలు ఏముంది? ఎవరైనా చేస్తే అది నిజం కాదని నమ్ముతున్నా” అని పేర్కొన్నారు. సీతక్క, సురేఖ ఇద్దరు మంత్రులు సమ్మక్క సారక్కలాగా పనిచేస్తున్నారు. జాతర కోసం మేము అందరం కట్టుబడి ఉన్నాం అని తెలిపారు. రాతి కట్టడాలకు అవసరమైన గ్రానైట్ పొరుగు రాష్ట్రాల నుండి తెప్పిస్తున్నామని, 90 రోజుల్లో పనులు పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు. అన్ని పనులు శాశ్వత ప్రతిపాదకన చేపడుతున్నామని, ఆది వాసీల ఆచార సంప్రదాయాలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్మాణాలు జరుగుతాయని చెప్పారు.
తాజావార్తలు
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!