Ponguleti Srinivas Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
- జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభం
- పాత లబ్ధిదారులకు మరో అవకాశం కల్పించిన ప్రభుత్వం
- ఫారెస్ట్-రెవెన్యూ భూముల వివాదాలపై ప్రత్యేక చర్యలు
- అసైన్డ్ ల్యాండ్స్, సాదాబైనామా సమస్యలకు పరిష్కారంపై హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : తెలంగాణలో సొంతింటి కల కలిగిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఆదిలాబాద్ జిల్లా వేదికగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘ఇందిరమ్మ ఇళ్ల’ రెండో విడత కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శనివారం మీడియాతో జరిపిన ప్రత్యేక చిట్చాట్లో ఆయన ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు కీలక రెవెన్యూ సమస్యలపై స్పష్టతనిచ్చారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పాత ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లో లబ్ధిదారులుగా ఉండి, రకరకాల కారణాల వల్ల ఇప్పటివరకు ఇళ్లు పూర్తి చేసుకోని వారికి ఈ విడతలో ప్రభుత్వం మరో అద్భుతమైన అవకాశం కల్పించబోతోందని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేదే ప్రభుత్వ ఆశయమని, నిబంధనల ప్రకారం పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు వీలుగా లబ్ధిదారులకు తగిన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
Also Read
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
- MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
- Damodar Rajanarsimha: వైద్యుల సేవలు అమూల్యం.. డాక్టర్స్ డే సందర్భంగా మంత్రి కీలక సందేశం
రెవెన్యూ శాఖలో ప్రజాప్రతినిధులు ప్రధానంగా మూడు రకాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని, వాటి పరిష్కారానికి యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా అటవీ (ఫారెస్ట్) , రెవెన్యూ భూములకు సంబంధించిన బోర్డర్ వివాదం సుదీర్ఘకాలంగా నడుస్తోందని గుర్తు చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తక్షణమే సరిహద్దులను (Borders) ఖరారు చేయాలని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లకు (DFO) ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా అత్యాధునిక రోవర్ల (Rovers) సహాయంతో అటవీ భూములను పూర్తిస్థాయిలో సర్వే చేసి, ఆ నివేదికను సంబంధిత జిల్లా కలెక్టర్లకు సమర్పించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
రాష్ట్రంలో అసైన్డ్ భూములకు సంబంధించిన పట్టాలు చేతిలో ఉండి, క్షేత్రస్థాయిలో సాగు చేసుకోవడానికి భూమి లేని నిర్పేదలను గుర్తించి, వారికి తగిన భూమిని చూపించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు సూచించినట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. దీంతో పాటు రెవెన్యూ ప్రైవేట్ ల్యాండ్స్ సమస్యలపై కూడా ప్రజాప్రతినిధులు కోరిన విధంగా త్వరలోనే సరైన పరిష్కారం చూపిస్తామన్నారు. సామాన్యులకు ఎంతో కాలంగా భారంగా మారిన సాదాబైనామా (రిజిస్ట్రేషన్ లేని సాదా కాగితాల లావాదేవీలు) అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ‘భూ భారతి’ పోర్టల్లో చేర్చిందని, ఈ పెండింగ్ భూ సమస్యలన్నింటినీ అతి త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరించి రైతులకు, భూ యజమానులకు ఊరట కలిగిస్తామని మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!