Saudi: సౌదీలో భారతీయ మహిళ హత్య.. ఎవరు చంపారంటే..!
- సౌదీ అరేబియాలో ఘోర విషాదం
- భారతీయ మహిళ హత్య
- భర్త, అత్తమామలపై బాధిత కుటుంబం ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌదీ అరేబియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారతీయ వివాహిత మహిళా అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బాధితురాలు ఉత్తరప్రదేశ్లోని లక్నోవాసిగా గుర్తించారు. వరకట్న వేధింపులతో భర్త చంపేశాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇది కూడా చదవండి: Indo-China: డ్రాగన్ కవ్వింపులు.. వివాదాస్పద సరిహద్దుపై పాక్తో ఒప్పందం.. భారత్ మండిపాటు
Also Read
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
లక్నోకు చెందిన ఐమాన్ ఖాన్. కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తోంది. ముస్లిం ఆచారాల ప్రకారం ఏప్రిల్ 10, 2025న లక్నోలో మొహమ్మద్ అమీర్ ఖాన్తో వివాహం అయింది. పెళ్లైన దగ్గర నుంచి భర్త, అత్తమామల నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. తొలుత ఇన్నోవా కారు కావాలని కోరితే.. వెంటనే కియా కారు కొనిచ్చారు. అయితే ఆ కారు అమీర్ పేరు మీద లేకపోవడంతో భార్య మొబైల్ ఫోన్ను పగలగొట్టాడు. అంతేకాకుండా వెంటనే సౌదీకి వెళ్లిపోయాడు. జూన్లో ఐమాన్ ఖాన్ను జెడ్డాకు పిలవడంతో అక్కడకు వెళ్లిపోయింది.
ఇది కూడా చదవండి: Maithili Thakur: ముంబైలో మైథిలి ఠాకూర్ ఎన్నికల ప్రచారం.. వెరైటీగా ఏం చేసిందంటే..!
తీరా వెళ్లాక భర్త, సోదరుడు, మరో ఇద్దరు బంధువులు రూ.20 లక్షలు తీసుకురావాలని వేధించడం ప్రారంభించారు. డబ్బు తీసుకురాకపోతే చంపేస్తామని బెదిరించారు. వేధింపులు తాళలేక అక్టోబర్ 2025న తిరిగి భారత్కు వచ్చేసింది. చేసేదేమీలేక అత్తమామలకు డబ్బు అందిస్తానని ఐమాన్ ఖాన్ తండ్రి హామీ ఇచ్చాడు. ఇక వేధించబోమని హామీ ఇవ్వడంతో తిరిగి అక్టోబర్ 19, 2025న ఐమాన్ ఖాన్ జెడ్డాకు వెళ్లింది. అయినా కూడా వేధింపులు ఆగలేదు. వెళ్లిన దగ్గర నుంచి ఆహారం పెట్టకుండా కడుపు మాడ్చడమే కాకుండా.. వేధింపులు ఎక్కవ కావడంతో తిరిగి భారత్కు వచ్చేస్తుండగా పాస్పోర్ట్ బలవంతంగా లాక్కుని ఇంటి నుంచి గెంటేశారు.
ఈ క్రమంలో డిసెంబర్ 17, 2025న వాట్సాప్ కాల్ సంభాషణ బట్టి బాధిత తండ్రికి అనుమానం వచ్చింది. ఏదో జరిగిందని అనుమానాలు రేకెత్తాయి. ఇక డిసెంబర్ 18 నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ రాకుండా బంద్ అయ్యాయి. దీంతో పొరుగువాడు సాయంతో.. పోలీసులు సమక్షంలో సోదాలు చేయగా ఐమాన్ ఖాన్ మృతదేహం లభ్యమైంది. దీంతో కుమార్తె మరణం తెలిసి కన్నీరు మున్నీరుగా విలపించారు.
సౌదీ నుంచి ఐమాన్ ఖాన్ మృతదేహాన్ని లక్నోకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా భర్త, అత్తమామలపై లక్నో పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. వరకట్న వేధింపులతో పాటు శారీరిక, మానసిక వేధింపులకు గురి చేశారని కంప్లంట్లో పేర్కొన్నారు. పోస్ట్ మార్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐమాన్ ఖాన్ ప్రస్తుతం గర్భవతి అని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా చిన్హాట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దినేష్ మిశ్రా తెలిపారు. ఈ కేసు విషయంలో విదేశాంగ శాఖ కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!