Saudi: సౌదీలో భారతీయ మహిళ హత్య.. ఎవరు చంపారంటే..!
- సౌదీ అరేబియాలో ఘోర విషాదం
- భారతీయ మహిళ హత్య
- భర్త, అత్తమామలపై బాధిత కుటుంబం ఫిర్యాదు
సౌదీ అరేబియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారతీయ వివాహిత మహిళా అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బాధితురాలు ఉత్తరప్రదేశ్లోని లక్నోవాసిగా గుర్తించారు. వరకట్న వేధింపులతో భర్త చంపేశాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇది కూడా చదవండి: Indo-China: డ్రాగన్ కవ్వింపులు.. వివాదాస్పద సరిహద్దుపై పాక్తో ఒప్పందం.. భారత్ మండిపాటు
Also Read
- Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
- Malacca Strait: షాకింగ్..! హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!
- Giorgia Meloni Jhumka: ఝుమ్కా లుక్తో భారత్ను ఆకట్టుకున్న ఇటలీ ప్రధాని మెలోని..
- US Sailor Attacked by Monkey: హార్మూజ్ మిషన్కు బయలుదేరిన అమెరికా సైనికుడిపై కోతి దాడి.. మందుపాతరల తొలగింపులో వింత ఘటన
లక్నోకు చెందిన ఐమాన్ ఖాన్. కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తోంది. ముస్లిం ఆచారాల ప్రకారం ఏప్రిల్ 10, 2025న లక్నోలో మొహమ్మద్ అమీర్ ఖాన్తో వివాహం అయింది. పెళ్లైన దగ్గర నుంచి భర్త, అత్తమామల నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. తొలుత ఇన్నోవా కారు కావాలని కోరితే.. వెంటనే కియా కారు కొనిచ్చారు. అయితే ఆ కారు అమీర్ పేరు మీద లేకపోవడంతో భార్య మొబైల్ ఫోన్ను పగలగొట్టాడు. అంతేకాకుండా వెంటనే సౌదీకి వెళ్లిపోయాడు. జూన్లో ఐమాన్ ఖాన్ను జెడ్డాకు పిలవడంతో అక్కడకు వెళ్లిపోయింది.
ఇది కూడా చదవండి: Maithili Thakur: ముంబైలో మైథిలి ఠాకూర్ ఎన్నికల ప్రచారం.. వెరైటీగా ఏం చేసిందంటే..!
తీరా వెళ్లాక భర్త, సోదరుడు, మరో ఇద్దరు బంధువులు రూ.20 లక్షలు తీసుకురావాలని వేధించడం ప్రారంభించారు. డబ్బు తీసుకురాకపోతే చంపేస్తామని బెదిరించారు. వేధింపులు తాళలేక అక్టోబర్ 2025న తిరిగి భారత్కు వచ్చేసింది. చేసేదేమీలేక అత్తమామలకు డబ్బు అందిస్తానని ఐమాన్ ఖాన్ తండ్రి హామీ ఇచ్చాడు. ఇక వేధించబోమని హామీ ఇవ్వడంతో తిరిగి అక్టోబర్ 19, 2025న ఐమాన్ ఖాన్ జెడ్డాకు వెళ్లింది. అయినా కూడా వేధింపులు ఆగలేదు. వెళ్లిన దగ్గర నుంచి ఆహారం పెట్టకుండా కడుపు మాడ్చడమే కాకుండా.. వేధింపులు ఎక్కవ కావడంతో తిరిగి భారత్కు వచ్చేస్తుండగా పాస్పోర్ట్ బలవంతంగా లాక్కుని ఇంటి నుంచి గెంటేశారు.
ఈ క్రమంలో డిసెంబర్ 17, 2025న వాట్సాప్ కాల్ సంభాషణ బట్టి బాధిత తండ్రికి అనుమానం వచ్చింది. ఏదో జరిగిందని అనుమానాలు రేకెత్తాయి. ఇక డిసెంబర్ 18 నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ రాకుండా బంద్ అయ్యాయి. దీంతో పొరుగువాడు సాయంతో.. పోలీసులు సమక్షంలో సోదాలు చేయగా ఐమాన్ ఖాన్ మృతదేహం లభ్యమైంది. దీంతో కుమార్తె మరణం తెలిసి కన్నీరు మున్నీరుగా విలపించారు.
సౌదీ నుంచి ఐమాన్ ఖాన్ మృతదేహాన్ని లక్నోకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా భర్త, అత్తమామలపై లక్నో పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. వరకట్న వేధింపులతో పాటు శారీరిక, మానసిక వేధింపులకు గురి చేశారని కంప్లంట్లో పేర్కొన్నారు. పోస్ట్ మార్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐమాన్ ఖాన్ ప్రస్తుతం గర్భవతి అని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా చిన్హాట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దినేష్ మిశ్రా తెలిపారు. ఈ కేసు విషయంలో విదేశాంగ శాఖ కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!