Ponguleti Srinivas Reddy : ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్
- స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై స్పష్టత
- వెల్లడించిన సంక్షేమ పథకాల అమలు ప్రణాళిక
- గెలిచే అవకాశాలున్న అభ్యర్థులకే ప్రాధాన్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : పాలేరు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఖమ్మం రూరల్, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల నుంచి నేతలు హాజరయ్యారు. ఒక్కో మండలానికి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన మంత్రి, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. రేపటి క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, స్పష్టమైన తేదీలు ప్రకటిస్తాం అని తెలిపారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత సర్పంచ్ , మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు.
Maoists : ఆపరేషన్ కగార్ దాడిని ఖండిస్తూ జూన్ 20న బంద్కు మావోయిస్టుల పిలుపు
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
“ఎన్నికలకు రావడానికి 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కావున, మీరు మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లను వెంటనే గుర్తించి పరిష్కరించి, సిద్ధంగా ఉండాలి,” అని మంత్రివర్యులు సూచించారు. రిజర్వేషన్ల ఆధారంగా గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేయాలని సూచించారు. “ప్రజలలోకి సంక్షేమ పథకాల ప్రాధాన్యతను తీసుకెళ్లే బాధ్యత నాయకులదే. ఇప్పటికే అనేక పథకాలు ప్రజల దరి చేరాయి. రాబోయే వారం రోజుల్లో అర్హులైన రైతులకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్, వారి వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది,” అని మంత్రి పేర్కొన్నారు.
మీ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు, నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా స్థానిక నాయకులదే. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలి అని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశం అనంతరం అన్ని మండలాల నేతలకు ప్రత్యేక సూచనలు చేసిన మంత్రి, గెలుపు కోసం క్రమబద్ధమైన ప్రణాళికతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. ప్రభాకర్, ప్రణీత్లను ఒకేసారి విచారణ
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!