Ponguleti Srinivas Reddy : ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్
- స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై స్పష్టత
- వెల్లడించిన సంక్షేమ పథకాల అమలు ప్రణాళిక
- గెలిచే అవకాశాలున్న అభ్యర్థులకే ప్రాధాన్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : పాలేరు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఖమ్మం రూరల్, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల నుంచి నేతలు హాజరయ్యారు. ఒక్కో మండలానికి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన మంత్రి, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. రేపటి క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, స్పష్టమైన తేదీలు ప్రకటిస్తాం అని తెలిపారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత సర్పంచ్ , మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు.
Maoists : ఆపరేషన్ కగార్ దాడిని ఖండిస్తూ జూన్ 20న బంద్కు మావోయిస్టుల పిలుపు
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
“ఎన్నికలకు రావడానికి 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కావున, మీరు మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లను వెంటనే గుర్తించి పరిష్కరించి, సిద్ధంగా ఉండాలి,” అని మంత్రివర్యులు సూచించారు. రిజర్వేషన్ల ఆధారంగా గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేయాలని సూచించారు. “ప్రజలలోకి సంక్షేమ పథకాల ప్రాధాన్యతను తీసుకెళ్లే బాధ్యత నాయకులదే. ఇప్పటికే అనేక పథకాలు ప్రజల దరి చేరాయి. రాబోయే వారం రోజుల్లో అర్హులైన రైతులకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్, వారి వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది,” అని మంత్రి పేర్కొన్నారు.
మీ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు, నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా స్థానిక నాయకులదే. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలి అని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశం అనంతరం అన్ని మండలాల నేతలకు ప్రత్యేక సూచనలు చేసిన మంత్రి, గెలుపు కోసం క్రమబద్ధమైన ప్రణాళికతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. ప్రభాకర్, ప్రణీత్లను ఒకేసారి విచారణ
తాజావార్తలు
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?