Junior Linemen Recruitment Test: లైన్ మెన్ నియామకంలో భారీ స్కామ్.. అదుపులో నలుగురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ల నియామక పరీక్షలో జరిగిన అక్రమాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించాయి. జూలై 17న జరిగిన రాత పరీక్షలో కొందరు అభ్యర్థులకు సెల్ఫోన్ ద్వారా సమాధానాలు రాయడాన్ని ఘట్కేసర్ లోని ఓ పరీక్షకేంద్రం అధికారి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయండో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరాతీయగా నిజాల తెలిసి ఖంగుతున్నారు. అక్కడ సెల్ఫోన్ పరీక్ష రాసింది ఒక్కరేకాదు పదుల సంఖ్యలో అభ్యర్థులు సెల్ఫోన్ల ద్వారా సమాధానాలు వెల్లినట్లు గుర్తించి నిర్ఘాంతపోయాలు.
నగరంలోని మలక్పేటలో విధులు నిర్వహిస్తున్న ఏడీఈ ఫిరోజ్ ఖాన్, కోదాడలో సహాయ ఇంజినీర్ గా పనిచేస్తున్న సైదులు పరీక్ష రాసిన వారికి సమాధానాలు అందజేశారని రాచకొండ పోలీసులు గుర్తించారు. అయితే వీరిద్దరి వద్దకు ప్రశ్నాపత్రం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈనేపథ్యంలో.. మరో నలుగురు విద్యుత్ శాఖ అధికారులను పోలీసుల అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు విశ్వనీయ సమాచారం.
Also Read
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
కాగా.. నగరంలో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు అధికారులు నాలుగేళ్లు నుంచి దందా కొనసాగిస్తున్నారని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ భారీ స్కామ్ లో ఇద్దరు సహాయ డిప్యటి ఇంజినీర్లు, నలుగురు సహాయ ఇంజినీర్లు, తొమ్మిది మంది లైన్మెన్లు అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందులోభాగంగా.. ఏడీఈల్లో ఒకరు ఉమ్మడి నల్గొండ, మరొకరు హైదరాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అయితే..వీరిద్దరు నాలుగేళ్ల క్రితం పలువురు అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.
కాగా.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 70 అసిస్టెంట్ ఇంజనీర్, వెయ్యి జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి మే 9 న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా జూలై 17న గ్రేటర్ హైదరాబాద్లోని పలు కేంద్రాల్లో ఉదయం జూనియర్ లైన్మెన్లకు, మధ్యాహ్నం అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
BJP MP Ravi Kishan: జనాభా నియంత్రణ బిల్లుపై రవికిషన్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజెన్లు
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!