Son’s Revenge: తండ్రి హత్యకు తనయుడి ప్రతీకారం.. రూ.30 లక్షల సుపారీ ఇచ్చి మరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన తండ్రిని 13ఏళ్ల కిందట హత్య చేసిన వ్యక్తిని రూ.30 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించిన ఘటనలో ప్రధాన నిందితుడితో సహా.. ఆరుగురిని మాల్కాజ్ గిరి ఎస్వోటి , జవహర్ నగర్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే మరో నలుగురు పరారీలో వున్నట్లు ప్రకటించారు. వీరి వద్దనుంచి వేట కొడవళ్లు, కత్తులు, కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ మహేష్ భగవత్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం దమ్మాయి గూడ పీఎస్ రావు నగర్ కు చెందిన ఎస్. శ్రీకాంత్ రెడ్డి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన తండ్రి జంగారెడ్డికి కాప్రా మండలం చక్రీపురం సతారాంనగర్ కు చెందిన రఘుపతికి భూ తగాదాలు ఉన్నాయని వివరించారు. అయితే రఘుపతిని జగ్గారెడ్డి నలుగురిలో అవమానించాడనే కోపంతో… 2009లో కొందరితో కలిసి జగ్గారెడ్డిని హత్య చేశాడు రఘుపతి.
Also Read
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
- Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
జగ్గారెడ్డి కుమారుడు ఈ ఘటనను మనసులో పెట్టుకుని రఘుపతిని హతమార్చేందుకు 3నెలల క్రితం ప్రణాళిక రచించాడు. అయితే.. కర్ణాటక షిమెగా జిల్లాలో ఉంటున్న తన తండ్రి స్నేమితుడు వ్యాపారి అయిన మంజునాథ్ ను కలిసి విషయం చెప్పాడు. మంజునాథ్, రిజ్వాన్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. రఘుపతిని హత్య చేసేందుకు రాజ్వాన్తో రూ.30 లక్షల ఒప్పందం కుదుర్చుకుని పథకం ప్రకారం ఈనెల 15న ఉదయం నుంచి రఘును అనుసరించి, రాత్రి 8.30 నిమిషాలకు తన మిత్రులైన ప్రసాద్, బాబుతో కలిసి దమ్మాయిగూడలోని ఓ మద్యం దుకాణం వద్ద రఘుపతిని వేట కొడవళ్లు, కత్తితో దాడిచేసి హత్య చేశారు. శ్రీకాంత్ రెడ్డి వారిని మార్గమధ్యంలో కలిసి రూ.30 లక్షలు అందించాడు. అయితే ఈవిషయం రఘు భార్య స్వర్ణలత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈఘటనపై వివరాలు బయటకు వచ్చాయి. ముంజునాథ్, సాదిక్, ఇస్మాయిల్, సమీర్ఖాన్, శ్రీకాంత్ రెడ్డిలను అరెస్ట్ చేయగా.. రిజ్వాన్, భవిత్, సుమిత్, పరారీలో వున్నారని పేర్కొన్నారు.
Harish Rao: కరోనా టెన్షన్.. బూస్టర్ డోసు పంపిణీ వేగవంతం చేయండి
తాజావార్తలు
-
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!