MP Navneet Kaur: కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు.. ఎంపీ నవనీత్ కౌర్పై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Navneet Kaur: బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్పై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నవనీత్ కౌర్పై పోలీసులు కేసు నమోదు అయ్యింది. ఇటీవల మహబూబ్ నగర్ బీజేపీ ఎంపి అభ్యర్థి డీకే అరుణ తో కలిసి షాద్ నగర్ పట్టణం లో కార్నర్ మీటింగ్ లో నవనీత్ కౌర్ మాట్లాడుతూ కాంగ్రెస్ కు ఓటు వేస్తే పాకిస్తాన్ కి వేసినట్లే అని చేసిన వ్యాఖ్యల పట్ల కేసు నమోదు అయింది. విద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు షాద్ నగర్ పోలీసులు తెలిపారు. ఇది ఇలా ఉండగా ఈనెల 8న హైదరాబాద్లో ఎంపీ అభ్యర్థి మాదవీలత తరపున ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్ ఒవైసీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Read also: Jolly LLB 3 : న్యాయమూర్తుల ప్రతిష్టను దిగజార్చేలా ఉంది.. ఆ సినిమాను నిషేధించండి
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే మేమేంటో చూపిస్తామని అక్బరుద్దీన్ చెబుతున్నాడు. అక్బరుద్దీన్ కు నేను సవాల్ విసురుతున్నా 15 నిమిషాలు ఎందుకు.. మాకైతే 15 సెకన్లు చాలు అన్నారు. ఆ 15 సెకన్లలోనే మీరు ఎక్కడి నుంచి వచ్చారో.. ఎక్కడికి వెళ్లిపోతారో మీకే తెలియదంటూ నవనీత్ రాణా హైదరాబాద్లో ప్రచారం సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే నవనీత్ కౌర్ మాటలకు ఏఐఎంఐం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. 15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి.. ముస్లింలను ఏం చేస్తారో చేయండని ఎంఐఎం చీఫ్ సవాల్ విసిరారు. అధికారమంతా మీ దగ్గరే ఉంది.. ఎక్కడికి రమ్మంటే తాము అక్కడికి వస్తామన్నారు. దీంతో బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం దుమారం రేపుతుంది.
Read also: Jolly LLB 3 : న్యాయమూర్తుల ప్రతిష్టను దిగజార్చేలా ఉంది.. ఆ సినిమాను నిషేధించండి
కాగా.. నవనీత్ రాణా ప్రకటనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని AIMIM డిమాండ్ చేసింది. ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించేలా బీజేపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, నవనీత్ రాణా ఈ ప్రకటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని పార్టీ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ అన్నారు. కాగా.. 2012లో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే తప్పితే లెక్కలు సరిచేస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన నవనీత్ కౌర్.. 15 నిమిషాలు అంటున్నారా.. పోలీసులు వెళ్లిపోతే మాకు 15 సెకన్లు చాలు.. ఏం జరుగుతుందని మీ సోదరులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆమె వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. నేను మోదీజీకి చెబుతున్నా… ఆమెకు 15 సెకన్లు కాదు గంట సమయం ఇస్తున్నాం… ఏం చేస్తుంది? మీలో మానవత్వం మిగిలి ఉందా లేదా అని మేము చూడాలనుకుంటున్నాము. ఇక్కడ ఎవరికీ భయం లేదా? మేం సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Bandi Sanjay: నీ మెడలు వంచి.. ప్రభుత్వాన్ని గద్దె దించింది నేనే.. కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్
తాజావార్తలు
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
-
Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
-
Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
-
Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!