మల్కాజిగిరి టీఆరెస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పై కేసు నమోదు చేసారు పోలీసులు. సెక్షన్స్ 307, 323,324,143,147,149 కింద కేసులు నమోదు చేసారు. మైనంపల్లి హనుమంతరావు మరియు మరో 15 మంది కార్యకర్తల పై కేసులు నమోదు చేసారు. ఇక ఇదిలా ఉంటె బీజేపీ పార్టీ అదేక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు రేపు బంద్ ప్రకటించారు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు. ప్రతి ఒక్కరు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై దాడికి నిరసనగా బంద్ లో పాల్గొనాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు. అయితే ఎమ్మెల్యే మైనంపల్లి ఎంపీ బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.