Agnipath Protests: సికింద్రాబాద్ అల్లర్లపై ఆవులను ప్రశ్నిస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గత వారం జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. రైల్వే ఆస్తులను భారీగా ధ్వంసం చేశారు. ఈ అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ప్రకాశం జిల్లా కంభంకు చెందిన ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆవుల సుబ్బారావును పోలీసులు నరసరావుపేట నుంచి హైదరాబాద్కు తరలించినట్టు తెలుస్తోంది. ఈ అల్లర్లలో ఆవుల సుబ్బారావు నిర్వహిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీరి చెందిన అభ్యర్థులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
వాట్సప్ గ్రూపుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఆవుల పాత్రను విశ్లేషిస్తున్నారు. ఇవాళ్ఠి నుంచి హైదరాబాద్లో ఆవుల సుబ్బారావును ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. సికింద్రాబాద్ అల్లర్లకు సంబంధించి పలువురు అభ్యర్థులతో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు అనేక ఫోటోలు దిగారు. ఈ అల్లర్లలో సుబ్బారాపు పాత్ర ఉందన్న అనుమానంతో ఈ నెల 18న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఆవుల సుబ్బారావుకి చెందిన సాయి అకాడమీలో తనిఖీలు చేశారు. నరసరావుపేట వచ్చిన ఐటీ, ఐబీ అధికారులు ఆయన అకాడెమీలో సోదాలు చేసి హార్డ్ డిస్క్, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. శిక్షణ పొందుతున్న యువకుల వ్యక్తిగత వివరాలు, ఫీజుల గురించి అడిగి తెలుసుకున్నారు.
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
తాజాగా విచారణకు రావాలంటూ సుబ్బారావుకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ నెల 27న విచారణకు రావాలంటూ ఆదేశాలిచ్చారు. దీనికి తోడు పోలీసులు విధ్వంసానికి సంబంధించి సమాచారం సేకరించేందుకు ఆవులను ప్రశ్నించనున్నారు. మరోవైపు ఈ అల్లర్లలో అరెస్టయిన విద్యార్ధుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్షమించి విడిచిపెట్టాలని, వారి భవిష్యత్తును నాశనం చేయవద్దని అధికారులను వేడుకుంటున్నారు. సికింద్రాబాద్ రైల్వే కేసులో మరికాసేపట్లో నిందితుల రిమాండ్ పై విచారణ జరగనుంది. సుబ్బారావు సహా 10మందిని రైల్వే కోర్టులో హాజరు పర్చనున్నారు పోలీసులు. రైల్వే పోలీసుల అదుపులో నిందితులు వున్నారు. 10 మందికి గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు పూర్తి చేస్తారు. అనంతరం వారిని తరలిస్తారు.
Film employees’ strike: సమ్మె పై ఫెడరేషన్ లో బిన్నాభిప్రాయాలు
తాజావార్తలు
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
-
TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
-
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!