Agnipath Protests: సికింద్రాబాద్ అల్లర్లపై ఆవులను ప్రశ్నిస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గత వారం జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. రైల్వే ఆస్తులను భారీగా ధ్వంసం చేశారు. ఈ అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ప్రకాశం జిల్లా కంభంకు చెందిన ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆవుల సుబ్బారావును పోలీసులు నరసరావుపేట నుంచి హైదరాబాద్కు తరలించినట్టు తెలుస్తోంది. ఈ అల్లర్లలో ఆవుల సుబ్బారావు నిర్వహిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీరి చెందిన అభ్యర్థులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
వాట్సప్ గ్రూపుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఆవుల పాత్రను విశ్లేషిస్తున్నారు. ఇవాళ్ఠి నుంచి హైదరాబాద్లో ఆవుల సుబ్బారావును ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. సికింద్రాబాద్ అల్లర్లకు సంబంధించి పలువురు అభ్యర్థులతో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు అనేక ఫోటోలు దిగారు. ఈ అల్లర్లలో సుబ్బారాపు పాత్ర ఉందన్న అనుమానంతో ఈ నెల 18న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఆవుల సుబ్బారావుకి చెందిన సాయి అకాడమీలో తనిఖీలు చేశారు. నరసరావుపేట వచ్చిన ఐటీ, ఐబీ అధికారులు ఆయన అకాడెమీలో సోదాలు చేసి హార్డ్ డిస్క్, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. శిక్షణ పొందుతున్న యువకుల వ్యక్తిగత వివరాలు, ఫీజుల గురించి అడిగి తెలుసుకున్నారు.
Also Read
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
తాజాగా విచారణకు రావాలంటూ సుబ్బారావుకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ నెల 27న విచారణకు రావాలంటూ ఆదేశాలిచ్చారు. దీనికి తోడు పోలీసులు విధ్వంసానికి సంబంధించి సమాచారం సేకరించేందుకు ఆవులను ప్రశ్నించనున్నారు. మరోవైపు ఈ అల్లర్లలో అరెస్టయిన విద్యార్ధుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్షమించి విడిచిపెట్టాలని, వారి భవిష్యత్తును నాశనం చేయవద్దని అధికారులను వేడుకుంటున్నారు. సికింద్రాబాద్ రైల్వే కేసులో మరికాసేపట్లో నిందితుల రిమాండ్ పై విచారణ జరగనుంది. సుబ్బారావు సహా 10మందిని రైల్వే కోర్టులో హాజరు పర్చనున్నారు పోలీసులు. రైల్వే పోలీసుల అదుపులో నిందితులు వున్నారు. 10 మందికి గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు పూర్తి చేస్తారు. అనంతరం వారిని తరలిస్తారు.
Film employees’ strike: సమ్మె పై ఫెడరేషన్ లో బిన్నాభిప్రాయాలు
తాజావార్తలు
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!