Pocharam Case : పోచారం కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు ఇబ్రహీం, మరో ఇద్దరు అరెస్ట్
- పోచారం కాల్పుల కేసులో ఇబ్రహీం సహా ముగ్గురు నిందితుల అరెస్ట్
- టాస్క్ఫోర్స్ ముందు లొంగిపోయిన నిందితులు
- గోవుల అక్రమ రవాణా అడ్డుకున్న ప్రశాంత్పై హత్యాయత్నం
- ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఇబ్రహీంపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pocharam Case : పోచారం కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు ఇబ్రహీం సహా మరో ఇద్దరు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి ఈ ముగ్గురు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు లొంగిపోయారు. అనంతరం టాస్క్ ఫోర్స్ అధికారులు వారిని రాచకొండ పోలీసులకు హ్యాండ్ఓవర్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ కాల్పుల కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు నిందితులను పోలీసులు నేడు మీడియా ముందుకు తీసుకురానున్నారు.
వివరాల ప్రకారం.. బాధితుడు ప్రశాంత్ సోను గత పది రోజుల్లో నాలుగు సార్లు గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్నాడు. దీనివల్ల ఆ గ్యాంగ్పై అతనికి శత్రుత్వం ఏర్పడింది. ఇబ్రహీం అనే వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా ప్రశాంత్కు ఫోన్ చేసి, పోచారం ప్రాంతానికి రమ్మని పిలిపించుకున్నాడు. అక్కడే హత్యాయత్నానికి ప్రణాళిక వేసి, కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read
- Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
ఇబ్రహీం అండ్ గ్యాంగ్ ప్రశాంత్ను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో ఈ దాడి జరిపినట్లు దర్యాప్తులో తేలింది. ఇబ్రహీంపై ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే గోవుల అక్రమ రవాణా కేసు నమోదై ఉంది. ప్రస్తుతం రాచకొండ పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకుని మరింత విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న మిగతా వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
Bihar Elections: ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్.. కాసేపట్లో ఉమ్మడి ప్రకటన
తాజావార్తలు
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!