Pocharam Case : పోచారం కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు ఇబ్రహీం, మరో ఇద్దరు అరెస్ట్
- పోచారం కాల్పుల కేసులో ఇబ్రహీం సహా ముగ్గురు నిందితుల అరెస్ట్
- టాస్క్ఫోర్స్ ముందు లొంగిపోయిన నిందితులు
- గోవుల అక్రమ రవాణా అడ్డుకున్న ప్రశాంత్పై హత్యాయత్నం
- ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఇబ్రహీంపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pocharam Case : పోచారం కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు ఇబ్రహీం సహా మరో ఇద్దరు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి ఈ ముగ్గురు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు లొంగిపోయారు. అనంతరం టాస్క్ ఫోర్స్ అధికారులు వారిని రాచకొండ పోలీసులకు హ్యాండ్ఓవర్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ కాల్పుల కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు నిందితులను పోలీసులు నేడు మీడియా ముందుకు తీసుకురానున్నారు.
వివరాల ప్రకారం.. బాధితుడు ప్రశాంత్ సోను గత పది రోజుల్లో నాలుగు సార్లు గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్నాడు. దీనివల్ల ఆ గ్యాంగ్పై అతనికి శత్రుత్వం ఏర్పడింది. ఇబ్రహీం అనే వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా ప్రశాంత్కు ఫోన్ చేసి, పోచారం ప్రాంతానికి రమ్మని పిలిపించుకున్నాడు. అక్కడే హత్యాయత్నానికి ప్రణాళిక వేసి, కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
ఇబ్రహీం అండ్ గ్యాంగ్ ప్రశాంత్ను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో ఈ దాడి జరిపినట్లు దర్యాప్తులో తేలింది. ఇబ్రహీంపై ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే గోవుల అక్రమ రవాణా కేసు నమోదై ఉంది. ప్రస్తుతం రాచకొండ పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకుని మరింత విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న మిగతా వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
Bihar Elections: ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్.. కాసేపట్లో ఉమ్మడి ప్రకటన
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!