Peace Committee: మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకి అప్పగించండి
- ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించాలి..
- దేశీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా మృతదేహాలను అప్పగించాలని పీస్ కమిటీ డిమాండ్..
- మావోయిస్టుల మృతదేహాలను భద్రపర్చకుండా వదిలేయడం ఆందోళన కలిగిస్తుంది: పీస్ కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peace Committee: ఛత్తీస్గఢ్లో మే 21వ తేదీన జరిగిన ఎన్ కౌంటరులో చనిపోయిన మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు సహా మిగతా మావోయిస్టులందరి మృతదేహాలను వారి బంధువులకు అప్పజెప్పాలని పీస్ కమిటీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మృతదేహాల అన్నింటిని వారి కుటుంబాలకు వెంటనే అందజేయాలన్నారు. మృతుల గౌరవానికి సంబంధించిన రాజ్యాంగ, న్యాయపరమైన, అంతర్జాతీయ బాధ్యతలను పూర్తిగా అమలు చేయాలని కోరారు. ఇక, పీస్ కో ఆర్డినేషన్ కమిటీ తరఫున ప్రొ.హరగోపాల్, ప్రొ.జి లక్ష్మణ్, డా. ఎం.ఎఫ్. గోపినాథ్, కవితా శ్రీవాత్సవ, క్రాంతి చైతన్య, మీనా కందసామి ఈ పత్రిక ప్రకటన విడుదల చేశారు.
Read Also: Monsoon : తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
Also Read
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
- KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
అయితే, మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత వారి కుటుంబీకులకు అప్పగిస్తామని ఛత్తీస్ గఢ్ అడ్వకేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు హామీ ఇచ్చినా.. ఇప్పటి వరకు వాటిని అప్పగించలేదని ఇది ఆందోళనకరం అని పీస్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మృతదేహాలతో గౌరవప్రదంగా వ్యవహరిచాలనే హక్కు ఉల్లంఘిస్తున్నారు.. గౌరవంగా భద్రపరచాలనే స్పష్టమైన చట్టపరమైన బాధ్యత ఉన్నప్పటికీ వాటిని కోల్డ్ స్టోరేజ్ లో భద్ర పర్చకుండా కుళ్లిపోయేలా వదిలేశారనే ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తోందని పీస్ కమిటీ పేర్కొంది.
Read Also: PSL 2025 Final: పీఎస్ఎల్ ఫైనల్ కోసం 6 వేల కిమీ జర్నీ.. ఫ్లైట్ డబ్బులు వృధా కాలే!
ఇలా వ్యవహరించడం వైద్య, చట్టపరమైన ప్రోటోకాల్ ను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పీస్ కమిటీ పేర్కొనింది. అయితే, మరణించిన వ్యక్తితో అమానవీయంగా వ్యవహరించడం, విషాదంలో ఉన్న కుటుంబాలకు మరింత మానసిక ఆందోళనను కలిగించడమేనని ఆరోపించింది. అంత్యక్రియల ఊరేగింపుల వల్ల శాంతిభద్రతల సమస్య వస్తుందని పేర్కొంటూ ఇద్దరి మృతదేహాలను అప్పగించడాన్ని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వ్యతిరేకించడం మాకు చాలా బాధ కలిగించిందని అన్నారు. సంతాపాన్ని నేరంగా పరిగణించే ఈ సమర్థన దుర్మార్గమైనదని.. రాజ్యాంగానికి వ్యతిరేకమని తెలిపారు. అంతిమ సంస్కారాలు చేయడానికి తాము ఎలాంటి షరతులకైనా కట్టుబడి ఉండటానికి రెడీగా ఉన్నానమని మరణించిన మావోయిస్టు కుటుంబాలు కోర్టుకు తెలిపినా.. ఇంకా మృతదేహాలను వారికి అప్పగించకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పీస్ కమిటీ వెల్లడించింది.
తాజావార్తలు
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..