Peace Committee: మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకి అప్పగించండి
- ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించాలి..
- దేశీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా మృతదేహాలను అప్పగించాలని పీస్ కమిటీ డిమాండ్..
- మావోయిస్టుల మృతదేహాలను భద్రపర్చకుండా వదిలేయడం ఆందోళన కలిగిస్తుంది: పీస్ కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peace Committee: ఛత్తీస్గఢ్లో మే 21వ తేదీన జరిగిన ఎన్ కౌంటరులో చనిపోయిన మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు సహా మిగతా మావోయిస్టులందరి మృతదేహాలను వారి బంధువులకు అప్పజెప్పాలని పీస్ కమిటీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మృతదేహాల అన్నింటిని వారి కుటుంబాలకు వెంటనే అందజేయాలన్నారు. మృతుల గౌరవానికి సంబంధించిన రాజ్యాంగ, న్యాయపరమైన, అంతర్జాతీయ బాధ్యతలను పూర్తిగా అమలు చేయాలని కోరారు. ఇక, పీస్ కో ఆర్డినేషన్ కమిటీ తరఫున ప్రొ.హరగోపాల్, ప్రొ.జి లక్ష్మణ్, డా. ఎం.ఎఫ్. గోపినాథ్, కవితా శ్రీవాత్సవ, క్రాంతి చైతన్య, మీనా కందసామి ఈ పత్రిక ప్రకటన విడుదల చేశారు.
Read Also: Monsoon : తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
అయితే, మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత వారి కుటుంబీకులకు అప్పగిస్తామని ఛత్తీస్ గఢ్ అడ్వకేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు హామీ ఇచ్చినా.. ఇప్పటి వరకు వాటిని అప్పగించలేదని ఇది ఆందోళనకరం అని పీస్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మృతదేహాలతో గౌరవప్రదంగా వ్యవహరిచాలనే హక్కు ఉల్లంఘిస్తున్నారు.. గౌరవంగా భద్రపరచాలనే స్పష్టమైన చట్టపరమైన బాధ్యత ఉన్నప్పటికీ వాటిని కోల్డ్ స్టోరేజ్ లో భద్ర పర్చకుండా కుళ్లిపోయేలా వదిలేశారనే ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తోందని పీస్ కమిటీ పేర్కొంది.
Read Also: PSL 2025 Final: పీఎస్ఎల్ ఫైనల్ కోసం 6 వేల కిమీ జర్నీ.. ఫ్లైట్ డబ్బులు వృధా కాలే!
ఇలా వ్యవహరించడం వైద్య, చట్టపరమైన ప్రోటోకాల్ ను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పీస్ కమిటీ పేర్కొనింది. అయితే, మరణించిన వ్యక్తితో అమానవీయంగా వ్యవహరించడం, విషాదంలో ఉన్న కుటుంబాలకు మరింత మానసిక ఆందోళనను కలిగించడమేనని ఆరోపించింది. అంత్యక్రియల ఊరేగింపుల వల్ల శాంతిభద్రతల సమస్య వస్తుందని పేర్కొంటూ ఇద్దరి మృతదేహాలను అప్పగించడాన్ని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వ్యతిరేకించడం మాకు చాలా బాధ కలిగించిందని అన్నారు. సంతాపాన్ని నేరంగా పరిగణించే ఈ సమర్థన దుర్మార్గమైనదని.. రాజ్యాంగానికి వ్యతిరేకమని తెలిపారు. అంతిమ సంస్కారాలు చేయడానికి తాము ఎలాంటి షరతులకైనా కట్టుబడి ఉండటానికి రెడీగా ఉన్నానమని మరణించిన మావోయిస్టు కుటుంబాలు కోర్టుకు తెలిపినా.. ఇంకా మృతదేహాలను వారికి అప్పగించకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పీస్ కమిటీ వెల్లడించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!