Peace Committee: మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకి అప్పగించండి
- ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించాలి..
- దేశీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా మృతదేహాలను అప్పగించాలని పీస్ కమిటీ డిమాండ్..
- మావోయిస్టుల మృతదేహాలను భద్రపర్చకుండా వదిలేయడం ఆందోళన కలిగిస్తుంది: పీస్ కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peace Committee: ఛత్తీస్గఢ్లో మే 21వ తేదీన జరిగిన ఎన్ కౌంటరులో చనిపోయిన మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు సహా మిగతా మావోయిస్టులందరి మృతదేహాలను వారి బంధువులకు అప్పజెప్పాలని పీస్ కమిటీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మృతదేహాల అన్నింటిని వారి కుటుంబాలకు వెంటనే అందజేయాలన్నారు. మృతుల గౌరవానికి సంబంధించిన రాజ్యాంగ, న్యాయపరమైన, అంతర్జాతీయ బాధ్యతలను పూర్తిగా అమలు చేయాలని కోరారు. ఇక, పీస్ కో ఆర్డినేషన్ కమిటీ తరఫున ప్రొ.హరగోపాల్, ప్రొ.జి లక్ష్మణ్, డా. ఎం.ఎఫ్. గోపినాథ్, కవితా శ్రీవాత్సవ, క్రాంతి చైతన్య, మీనా కందసామి ఈ పత్రిక ప్రకటన విడుదల చేశారు.
Read Also: Monsoon : తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
Also Read
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
అయితే, మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత వారి కుటుంబీకులకు అప్పగిస్తామని ఛత్తీస్ గఢ్ అడ్వకేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు హామీ ఇచ్చినా.. ఇప్పటి వరకు వాటిని అప్పగించలేదని ఇది ఆందోళనకరం అని పీస్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మృతదేహాలతో గౌరవప్రదంగా వ్యవహరిచాలనే హక్కు ఉల్లంఘిస్తున్నారు.. గౌరవంగా భద్రపరచాలనే స్పష్టమైన చట్టపరమైన బాధ్యత ఉన్నప్పటికీ వాటిని కోల్డ్ స్టోరేజ్ లో భద్ర పర్చకుండా కుళ్లిపోయేలా వదిలేశారనే ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తోందని పీస్ కమిటీ పేర్కొంది.
Read Also: PSL 2025 Final: పీఎస్ఎల్ ఫైనల్ కోసం 6 వేల కిమీ జర్నీ.. ఫ్లైట్ డబ్బులు వృధా కాలే!
ఇలా వ్యవహరించడం వైద్య, చట్టపరమైన ప్రోటోకాల్ ను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పీస్ కమిటీ పేర్కొనింది. అయితే, మరణించిన వ్యక్తితో అమానవీయంగా వ్యవహరించడం, విషాదంలో ఉన్న కుటుంబాలకు మరింత మానసిక ఆందోళనను కలిగించడమేనని ఆరోపించింది. అంత్యక్రియల ఊరేగింపుల వల్ల శాంతిభద్రతల సమస్య వస్తుందని పేర్కొంటూ ఇద్దరి మృతదేహాలను అప్పగించడాన్ని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వ్యతిరేకించడం మాకు చాలా బాధ కలిగించిందని అన్నారు. సంతాపాన్ని నేరంగా పరిగణించే ఈ సమర్థన దుర్మార్గమైనదని.. రాజ్యాంగానికి వ్యతిరేకమని తెలిపారు. అంతిమ సంస్కారాలు చేయడానికి తాము ఎలాంటి షరతులకైనా కట్టుబడి ఉండటానికి రెడీగా ఉన్నానమని మరణించిన మావోయిస్టు కుటుంబాలు కోర్టుకు తెలిపినా.. ఇంకా మృతదేహాలను వారికి అప్పగించకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పీస్ కమిటీ వెల్లడించింది.
తాజావార్తలు
-
RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే
-
National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
-
LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!