Telangana Formation Day: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Formation Day: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు అవుతుంది. అవతరణ ఏర్పాట్లను సీఎస్, డిజిపి, ఉన్నతాధికారులు పరిశీలించారు. జూన్ 2 ప్రభుత్వ కార్యక్రమానికి విశిష్ట అతిధి సోనియాగాంధీ రానున్నారు. సుమారు 20 నుంచి 25 వేల మంది కోసం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు చేస్తున్నారు. 1860 మంది వీవీఐపీలు, 11 వేల మంది సామాన్య ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
Read also: Amantullah Khan : ఆప్ ఎమ్మెల్యే పై బిగుస్తున్న ఉచ్చు.. అటాచ్మెంట్కు కోర్టు ఆదేశాలు
Also Read
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
జూన్ 2న ఉదయం 9.30 గంటలకు గన్పార్క్లోని అమర వీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో మరణించిన వారికి ముఖ్యమంత్రి నివాళులర్పిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. పోలీసు బలగాల కవాతు, మార్చ్ ఫాస్ట్, గౌరవ వందనం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సోనియా గాంధీ ప్రసంగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. పోలీసు సిబ్బందికి, ఉత్తమ సిబ్బందికి అవార్డులు అందజేస్తారు. అవార్డు గ్రహీతలతో ఫోటో సెషన్ తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. జూన్ 2వ తేదీ సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ట్యాంక్ బండ్ పై తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
Read also: RBI : విదేశాల నుంచి టన్నుల కొద్ది బంగారం వెనక్కి తీసుకురానున్న ఆర్బీఐ
సాయంత్రం 6.30 గంటలకు ముఖ్యమంత్రి ట్యాంక్బండ్కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టేలా కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్ షో అనంతరం ట్యాంక్ బండ్ పై చివరి నుంచి చివరి వారం వరకు జాతీయ జెండాలతో భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు. ఇందులో దాదాపు 5 వేల మంది పాల్గొంటారు. ఈ సందర్భంగా ఫ్లాగ్ వాక్ జయ జయహే తెలంగాణ పూర్తి వెర్షన్ (13.30 నిమిషాలు) పాటను విడుదల చేయనున్నారు. తెలంగాణ కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణిని సన్మానిస్తారు. రాత్రి 8.50 గంటలకు హుస్సేన్ సముద్రంపై ఆకాశాన్ని పది నిమిషాల పాటు పేల్చే బాణసంచా కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి.
Viral video: నడిరోడ్డుపై బర్త్ డే సెలబ్రేషన్స్.. వాహనదారులకు ఇక్కట్లు
తాజావార్తలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్కే ఓటు..
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!