Telangana Formation Day: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Formation Day: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు అవుతుంది. అవతరణ ఏర్పాట్లను సీఎస్, డిజిపి, ఉన్నతాధికారులు పరిశీలించారు. జూన్ 2 ప్రభుత్వ కార్యక్రమానికి విశిష్ట అతిధి సోనియాగాంధీ రానున్నారు. సుమారు 20 నుంచి 25 వేల మంది కోసం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు చేస్తున్నారు. 1860 మంది వీవీఐపీలు, 11 వేల మంది సామాన్య ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
Read also: Amantullah Khan : ఆప్ ఎమ్మెల్యే పై బిగుస్తున్న ఉచ్చు.. అటాచ్మెంట్కు కోర్టు ఆదేశాలు
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
జూన్ 2న ఉదయం 9.30 గంటలకు గన్పార్క్లోని అమర వీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో మరణించిన వారికి ముఖ్యమంత్రి నివాళులర్పిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. పోలీసు బలగాల కవాతు, మార్చ్ ఫాస్ట్, గౌరవ వందనం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సోనియా గాంధీ ప్రసంగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. పోలీసు సిబ్బందికి, ఉత్తమ సిబ్బందికి అవార్డులు అందజేస్తారు. అవార్డు గ్రహీతలతో ఫోటో సెషన్ తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. జూన్ 2వ తేదీ సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ట్యాంక్ బండ్ పై తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
Read also: RBI : విదేశాల నుంచి టన్నుల కొద్ది బంగారం వెనక్కి తీసుకురానున్న ఆర్బీఐ
సాయంత్రం 6.30 గంటలకు ముఖ్యమంత్రి ట్యాంక్బండ్కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టేలా కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్ షో అనంతరం ట్యాంక్ బండ్ పై చివరి నుంచి చివరి వారం వరకు జాతీయ జెండాలతో భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు. ఇందులో దాదాపు 5 వేల మంది పాల్గొంటారు. ఈ సందర్భంగా ఫ్లాగ్ వాక్ జయ జయహే తెలంగాణ పూర్తి వెర్షన్ (13.30 నిమిషాలు) పాటను విడుదల చేయనున్నారు. తెలంగాణ కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణిని సన్మానిస్తారు. రాత్రి 8.50 గంటలకు హుస్సేన్ సముద్రంపై ఆకాశాన్ని పది నిమిషాల పాటు పేల్చే బాణసంచా కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి.
Viral video: నడిరోడ్డుపై బర్త్ డే సెలబ్రేషన్స్.. వాహనదారులకు ఇక్కట్లు
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!